ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, August 11, 2011

జాత్యహంకార తిరుగుబాటుతో రగులుతున్న లండన్..



లండన్ లో రాజుకున్న సెగలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు... ఈ అల్లర్లకు బ్రిటన్ ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతున్నప్పటికీ... అసలు కారణం మాత్రం పభుత్వం పై ప్రజల్లో ఉన్న అసంతృప్తేనని తెలుస్తోంది.. నగరాలన్నీ అగంతుకుల దాడులతో అట్టుడికి పోతున్నాయి.. నేరస్థులను విచారించే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు స్పీడ్ గా విచారణ జరుపుతున్నా... రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోపక్క లూటీలు, దొమ్మీల నుంచి అల్లరి మూకలు హత్యా నేరాల వైపు మళ్లుతున్నారు. పరిస్థిితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలేవీ ఫలిస్తున్నట్టు కనిపించకపోగా.. అల్లర్లను అదుపు చేయాల్సిన పోలీసు బలగాలే అసంతృప్తతో రగులుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
బ్యాంగ్ - 'బర్నింగ్' హోం
యాంకర్ 1
లండన్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టేటట్టు కనిపించడం లేదు. బర్మింగ్ హాం.. బర్నింగ్ హోంలా నిత్యం అగ్నిగుండంలా రగులుతోంది. అల్లరి మూకలు పెట్రోల్ బాంబులతో పెట్రేగిపోతున్నారు.. ఒక పక్క జాత్యహంకార దాడులు, మరో పక్క ప్రభుత్వం పై అసమ్మతి సెగలు.. అన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అల్లర్లను అదుపు చేసేందుకు భారీ గా బలగాలను దించినా ఎటువంటి ఫలితమూ లేదు. సాయంత్రమయితే చాలు అల్లరి మూకలు విజృంబిస్తున్నాయి..
విజవల్స్
వాయిస్
లండన్ నగరం నాలుగు రోజులుగా హింస, లూటీలతో అట్టుడికిపోతోంది. లండన్‌లో ప్రారంభమైన అల్లర్లు మరో మూడు ప్రధాన నగరాలకు కూడా వ్యాపించాయి. బ్రిటన్‌లో 1980 తర్వాత ఇంత భారీగా అల్లర్లు చెలరేగడం ఇదే మొదటిసారి. అల్లరి మూకలు లండన్‌లో భవనాలకు, వాహనాలకు, చెత్త కుప్పలకు నిప్పు అంటిస్తూ వెళ్లిపోతున్నారు. పోలీసు అధికారులపైకి బాటిళ్లు, ఫైర్ వర్క్స్ రువ్వుతూ దుకాణాలను లూటీ చేస్తున్నారు. ఈ వేసవిలో 2012 కామన్‌వెల్త్ క్రీడలు జరుగనుండగా.. ఈ అల్లర్లు క్రీడలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
విజువల్స్
వాయిస్
సభ్యతాసంస్కారానికి ప్రతీకలుగా చెప్పుకునే ఆంగ్లేయుల ప్రతిష్ఠను ఈ అల్లర్లు మసకబార్చాయి. పగలంతా ప్రశాంతంగా ఉండి సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి వరకు అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయి. యువకులు గుంపుగుంపులుగా ముసుగులు ధరించి దోపీడీలకు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు ఇటలీ పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్‌ పర్యటన నుంచి వెనుతిరిగారు. నగరాల్లో హింసను నిరోధించడానికి అన్ని చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 20 వేల మందికి పై చిలుకు పోలీసులను నగరంలో మొహరించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. మరికొంత మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు.

ఈ అల్లర్లకు మూలాలేంటనే విషయంలో బ్రిటన్ ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోంది. మొదట మార్క్ డగ్లన్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో నల్లజాతీయులు కోపంతో నిరసన ప్రారంభిచారు. వారిపై లాఠీ ఝుళిపించడంతో నిరనలు తారాస్థాయికి చేరాయి. మొదటగా ఈ అల్లర్లు లండన్‌లో ప్రారంభమయి... మిగతా నగరాలకు కూడావిస్తరించించాయి. సాయంత్రమైతే చాలు... అల్లరి మూకలు పెట్రోల్ బాంబులు, రాళ్లు, సీసాలతో దాడులకు పాల్పడుతున్నారు.
యాంకర్ 2
లండన్ లో అల్లర్లకు కారణం కేవలం డగ్లన్ అనే నల్లజాతీయుణ్ని పోలీసులు కాల్చి చంపడమే కారణమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. ఒక వ్యక్తిని చంపినందుకు ఒక జాతి... జాతి మొత్తం ఇంతగా చెలరేగిపోయి విధ్యంసం సృష్టిస్తుందా... అలా చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా... అల్లర్లకు అసలు కారణమేంటో ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు... అల్లర్ల బలమెంతో.. అవి ఏ స్థాయికి చేరుతాయో కూడా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ అప్రమత్తమయ్యే సమయానికి ప్రమాదం ముంచుకొచ్చింది. ఇంతకీ లండన్ లో ఏం జరుగుతోంది...
విజువల్
వాయిస్
శాంతి యుతంగా నిరసన చేస్తున్న డగ్లన్ కాల్చి చంపిన విషయంలో పోలీసులు రకరకాల కథనాలు వినిపిస్తున్నారు. అల్లర్లకు మూల కారణమైన డగ్లన్ మాదకద్రవ్యాలు విక్రయించే ముఠాకు నేతృత్వం వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ అల్లర్లకు వేరే కారణాలు కూడా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 2012 కామన్ వెల్త్ క్రీడల్లో నల్లజాతి వారికి ప్రాధాన్యం పూర్తిగా తగ్గించినందువల్ల డగ్లన్ నిరసనకు దిగాడు. శాంతియుతంగా నిరసన చేస్తున్న డగ్లన్ ను పోలీసులు కాల్చి చంపి అతనే తమ పై కాల్పులు జరిపితే తాము ఎదురు కాల్పులు జరిపామనే కథనం వినిపించారు. వాస్తవాలు తెలుసుకున్న యువకులు ఆగ్రహంతో ఊగిపోయారు. నగరవీధులన్నీ నిప్పుల కుంపట్లుగా మారిపోయాయి. దుకాణాలన్నీ లూఠీలకు, దోపిడీలకు గురయి పోతున్నా.. వ్యాపారులు చూస్తూ నిస్తేజంగా నిలుచుండటం మినహా ఏమీచేయలేని పరిస్తిితి.. ఈ దాడుల్లో అత్యధికం యువకులే పాల్గొంటున్నారు... యువతీ యువకులే కాకుండా పిల్లలు కూడా దాడుల్లో పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దొరికిన నేరస్థులందరినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారించి వదిలేస్తున్నారు. కొందరిని రిమాండ్ కు పంపినా వెంటనే బెయిల్ మంజూరు చేసి విడుదల చేస్తున్నారు.
విజువల్స్
వాయిస్
రవి అస్తమించని రాజ్యంగా పేరొందిన ఇంగ్లాండ్‌లో ప్రజల మధ్య సంబంధాలు మేడిపండు చందంలా తయారయ్యాయి.. ప్రజాస్వామ్యం, జాతుల జీవనం పేరుతో తక్కువ వేతనాలకు పనిచేస్తారనే ఉద్ధేశంతో ఆఫ్రికా, కరేబియన్ దీవులకు చెందిన వారిని వలసల పేరుతో ప్రోత్సహించిన ఆంగ్లేయులకు వారి పాపాలే వారి మెడకు చుట్టుకున్నాయి. స్థానిక ప్రజలకు, వలస వచ్చిన వారికి మధ్య ఆర్ధిక వ్యత్యాసం పెరిగిపోయింది. లండన్ పేరుకు మెట్రోపాలిటన్ నగరమై అయినప్పటికీ బతుకుదెరువుకోసం వలసవచ్చిన వారంతా పక్కకు విసిరవేసినట్లు ప్రత్యేక వాడల్లో జీవనం సాగిస్తున్నారు. పోలీసులు వారిపై నిఘాపెట్టడం, ఆంగ్లేయులు వారి శ్రమను దోచుకోవడం వంటి కారణాల వల్ల వారు మానసిక సంఘర్షణకు గురయ్యారు. రోజు రోజుకూ ఈ అసమ్మతి పెరిగిపోసాగింది. ఇంగ్లాండ్ లో జాత్యహంకార వ్యవస్థ రోజురోజుకూ పెరుగుతున్నా.. ప్రభుత్వం పట్టీ పట్టనట్టు ఉండటమే కాకుండా.. అగ్నికి ఆజ్యం పోసినట్టు కామన్ వెల్త్ క్రీడల్లో తక్కువ మందికి అవకాశం ఇవ్వడం నల్లజాతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం అయింది. . తాజా అల్లర్లలో నల్లజాతి ముఠాలు బ్యాంకులు, ఏటీఎంల, జోలికి పోకుండా బ్రాండెడ్ దుస్తులు అమ్మే దుకాణాలు, అలంకరణ సామగ్రి దుకాణాలపైనే దృష్టి సారించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
విజువల్స్
వాయిస్
అల్లర్లకు మూలం డగ్లన్ ను కాల్చడమే అయినప్పటికీ... అల్లర్లు పెరగడానికి రకరకాల కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన లండన్‌ ఒలింపిక్స్‌ 2012 ద్వితీయార్థంలో జరగనున్నాయి. ఈ క్రీడల్లో నల్ల జాతి వారి పట్ల వివక్ష చూపారనే అపవాదు మూటగట్టుకుంది ప్రభుత్వం. క్రీడలు జరగబోయే ఏడాది ముందు ఇంత విస్తృత స్థాయిలో ఘర్షణలు జరగడం... వాటిని యువత ప్రొత్సహించడం వెనుక ప్రభుత్వం పై ఎంత అసమ్మతితో ఉన్నాయో చెప్పకనే చెబుతోంది. . బ్రిటన్‌ ప్రతిష్టకు ఇది పెద్ద దెబ్బే.


అభివృద్ది చెందిన దేశాలకు ముందువరసలో నిటబడి... దిశానిర్ధేశం చేసే బ్రిటన్ సంక్షేమ రంగాలకు భారీగా కోత విధించడమేకాక... ఉపాధి అవకాశాలను కూడా కుదించడం యువతలో నిరుత్సాహానికి ప్రధాన కారణం.. దీంతో బాటు అసలు కారణాలను పక్కన బెట్టి...అసమ్మతులను అణిచివేసేందుకు ప్రభుత్వం నియంతలా ప్రవర్తించడం అల్లర్లు మరింత పెరగడానికి కారణంగా కనిపిస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఆదర్శ ప్రాయమైనదిగా చెప్పకునే బ్రిటన్‌ వైద్య రంగంలో సంక్షేమానికి కోతపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇతర రంగాల్లోనూ సంక్షేమ వ్యయాన్ని కత్తిరిస్తున్నారు. 2015 నాటికి ప్రభుత్వ వ్యయంలో 8 వేల కోట్ల పౌండ్లు కోత విధించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కత్తిరింపులు మొదలయ్యాయి. మార్క్‌ డగ్గన్‌ను కాల్చి చంపిన దక్షిణ లండన్‌లోని టోటెన్‌హాం ప్రాంతంలో యువజన సర్వీసులకిచ్చే బడ్జెట్‌లో 75 శాతం కోతపెట్టారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగిత 20 శాతం నమోదయ్యింది. సంక్షేమ బడ్జెట్‌ కోత పడడంతో యువతీ యువకుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. బ్రిటన్‌ యువతలో అసంతృప్తి జ్వాలలు రగలడానికి ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి.. అసంతృప్తులను, అసమ్మతులను అణిచివేసేందుకు ఉపయోగించే పోలీసులు కూడా అసంతృప్తితో రగులతున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా టోరీ ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో 34 వేల పోలీసు ఉద్యోగుల పోస్టులను రద్దుచేయ నిర్ణయించింది. పోలీసు బడ్జెట్‌లో 20 శాతం కోత విధించింది. మీడియాను సైతం టోరీ పాలన వదిలిపెట్టలేదు. ఆ దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ అయిన బిబిసికి ప్రభుత్వం నుంచి ఇచ్చే కేటాయింపులకు కోతపెట్టింది. అందుకు నిరసనగా గడిచిన రెండు నెలల్లోనే బిబిసి పాత్రికేయులు రెండుసార్లు సమ్మె చేశారు. ఇలా బ్రిటన్‌లోని వివిధ వర్గాలు, తరగతులకు చెందిన ప్రజానీకం ప్రభుత్వ చర్యలతో అసంతృప్తి చెందాయి. . . నిరసనలకు మూల కారణమైన ఉదారవాద ఆర్థిక విధానాలను అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదా కనీసం ఆ వేగాన్ని తగ్గించాలి. అప్పుడే బ్రిటన్‌లో మంటలు చల్లారుతాయి. ప్రపంచమంతా మానవహక్కులు, ప్రజాస్వామ్యం, సమానత్వం అంటూ ప్రపంచదేశాలకు హితబోధ చేసే పాశ్చాత్య దేశాలు తమ దేశాల్లో వాస్తవంగా నెలకొన్న వాస్తవ పరిస్థితిని ఎంత కప్పి పెట్టినా ఏదో ఒకరోజు నివురు చెరిగిన నిప్పులా రగిలి రగిలి దావానంలా వ్యాపిస్తుందనే సత్యం మరోమారు రుజువయింది.

1 comment:

  1. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన ఆర్టికల్

    ReplyDelete