చట్టం తన పని తాను చేసుకుపోతుంది....చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకోకూడదు....న్యాయ రక్షణకు పోలీసులు ఉన్నారు....ఇదీ మన రాజ్యాంగం చెబుతున్న మాట....పెద్దలు నిర్దేశించిన బాట...అయితే....ప్రభుత్వమే ప్రైవేట్ ఆర్మీని ప్రోత్సహిస్తే......పోలీసులు చేయలేని...చేయకూడని కొన్ని పనులును.....వారితో చేయిస్తే.....ఏం జరుగుతుంది....రాజ్యం కొందరికి భోజ్యం అవుతుంది....సర్కార్ అండతో అరాచకాలు జరుగుతాయి...అలాంటి దారుణాలు మన దేశంలో జరిగాయి....సల్వాజుడుం.....గత కొన్నేళ్లుగా ఈ పేరు తెలీని పెద్దమనిషి ఉండడు....మావోయిస్ట్లకు పోటీగా తుపాకీ పట్టిన ప్రైవేట్ ఆర్మీ.....చత్తీస్ఘడ్ ప్రభుత్వ అండదండలతో అడవుల్లో నెత్తురు పారించిన సేన....ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను నిజం చేసిన చత్తీస్గడ్ పెద్దల నిర్వాకం......గిరిజన జీవితాల్లో చీకటి నింపింది.ఛత్తీస్ గఢ్ లో నక్సలైట్ల అణచివేతకు అక్కడి ప్రభుత్వం ఆదివాసీల్లోని ఒక తెగతో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసింది. దానిపేరే సల్వాజుడుం....17 నుంచి 25 సంవత్సరాలున్న యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చింది. వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా జీతం ఇచ్చింది. ఆధునికి ఆయుధాలు భుజాన పెట్టింది. కొంచెం చదువుకున్న వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించింది. వీరి నియామకాలకు ఎటువంటి నిబంధనలు ఉండవు. వారు చేసే హింసాకాండకు ఎటువంటి శిక్షలు ఉండవు. ఆదివాసీల జీవితాలను చెల్లాచెదురు చేసినా, దారుణహింసకు పాల్పడినా, ఊళ్లకు ఊళ్లనే తగుల బెట్టినా....వారిని ప్రశ్నించే హక్కు కోర్టులకు కూడా ఉండదు. కేవలం పోలీసులతో చేయించలేని కొన్ని పనులను చేయించడానికి.....మావోలను ఉక్కుపాదంతో అణిచివేయడానికే సల్వాజుడుం ఏర్పాటు జరిగింది.సల్వాజుడుంని అడ్డుపెట్టుకుని చత్తీస్గడ్ సర్కార్ చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కాదు. సల్వాజుడుం చెలరేగినన్నాళ్లూ.....ఆదివాసీల జీవితాల్లో చీకటి రోజులే.....ఆదివాసీలు నక్సలైట్లకు ఆశ్రయం కల్పించారన్న నెపంతో పసిబిడ్డల చేతివేళ్ళను నరికిన రాక్షసత్వం సల్వాజుడుం నరనరాన్న జీర్ణించుకుంది. అమాయక ఆదివాసీల మానాన్ని కాపాడే ప్రయత్నం అక్కడ పోలీసులుకూడా చేయరు. కోట్ల రూపాయలు వీరి ఆయుధాలకు, వీరి భృతికి చెల్లిస్తున్నా ఇంతవరకు ఎక్కడి నుంచి ఈ నిధులను మళ్ళిస్తున్నారో లెక్కా పత్రం ఉండదు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పరిగణిస్తున్న ఈ సల్వాజుడుం సైన్యం ఏర్పాటుకి ఎటువంటి చట్టబద్దత ఉండదు. వారికోసం చేస్తున్న ఆదాయ వ్యయాల లెక్కలుండవు. ఇదంతా ఓ అవినీతిలో భాగమేనంటున్నారు కొందరు ప్రజాస్వామిక వాదులు. అవినీతి నల్లధనాన్ని ప్రైవేటు సైన్యానికి ఖర్చుచేస్తూ బహుళజాతి కంపెనీలకు లాభం చేకూర్చేందుకేననేది వీరి వాదన. ఓ రకంగా చూస్తే ఆదివాసీలతోనే తోటివారి కన్ను పొడుస్తోంది. మట్టి తమ చేతులకు అంటకుండా చూసుకుంటోంది. ఉపాధిలేని ఆదివాసీలకు తుపాకులు ఇచ్చి, కేవలం వందల రూపాయల జీతం ముట్టజెప్పి తమ సోదరులపైకే ఉసి గొల్పుతున్నారు. వన సంపద కొల్లగొట్టే నల్లదొర కుట్రలు తెలీని ఈ అమయాక గిరిజనలు, తోటి ఆదీవాసీల ప్రాణాలను తీసేస్తున్నారు...నక్సలైట్ల అణచివేతలో భాగంగా వీరిని నియమించామని మాత్రమే ప్రభుత్వం చెపుతుంది. ఆదివాసీల గ్రామాలపైబడి వారిని భయభ్రాంతులకు గురిచేయడం. వారి ఆస్తులను ధ్వంసం చేయడం వీరి రోజువారీ కార్యక్రమం. హత్యలు, అత్యాచారాలు వీరి నిత్యకృత్యాలు. నక్సలైట్లకు ఆశ్రయమిచ్చారన్న నెపంతో గ్రామాలకు గ్రామాలనే తగుల బెట్టిన ఎస్ పిఓ లకు సర్వ హక్కులు ఉంటాయి. వారు ఏం చేసినా ఇదేమని ప్రశ్నించే హక్కు మాత్రం అక్కడి ఆదివాసీలకు గానీ ఎవ్వరికీ ఉండదు. అలా అడిగితే వారు నక్సలైట్ల కిందే లెక్క. నక్సలైట్లని పేరుంటే ఏమైనా చేసే అధికారం మాత్రం అనధికారికంగా పోలీసులకి, సల్వాజుడుంకి ఉంటుంది. అందుకే చివరకు ఏళ్ళతరబడి ఆదివాసీల కోసం స్థానికంగా పనిచేస్తున్న ఎన్ జీ ఓలు సైతం ఆ సాహసం చేయలేవు. అటువంటి సాహసం చేసిన వారికి పోలీసుల వేధింపులు తప్పలేదు.నక్సలైట్ల బూచి చూపి ప్రజలపైన, సామాన్య ఆదివాసీలు,
Friday, August 19, 2011
సల్వాజుడుం- ప్రభుత్వానికి ప్రైవేట్ సైన్యం
చట్టం తన పని తాను చేసుకుపోతుంది....చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకోకూడదు....న్యాయ రక్షణకు పోలీసులు ఉన్నారు....ఇదీ మన రాజ్యాంగం చెబుతున్న మాట....పెద్దలు నిర్దేశించిన బాట...అయితే....ప్రభుత్వమే ప్రైవేట్ ఆర్మీని ప్రోత్సహిస్తే......పోలీసులు చేయలేని...చేయకూడని కొన్ని పనులును.....వారితో చేయిస్తే.....ఏం జరుగుతుంది....రాజ్యం కొందరికి భోజ్యం అవుతుంది....సర్కార్ అండతో అరాచకాలు జరుగుతాయి...అలాంటి దారుణాలు మన దేశంలో జరిగాయి....సల్వాజుడుం.....గత కొన్నేళ్లుగా ఈ పేరు తెలీని పెద్దమనిషి ఉండడు....మావోయిస్ట్లకు పోటీగా తుపాకీ పట్టిన ప్రైవేట్ ఆర్మీ.....చత్తీస్ఘడ్ ప్రభుత్వ అండదండలతో అడవుల్లో నెత్తురు పారించిన సేన....ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను నిజం చేసిన చత్తీస్గడ్ పెద్దల నిర్వాకం......గిరిజన జీవితాల్లో చీకటి నింపింది.ఛత్తీస్ గఢ్ లో నక్సలైట్ల అణచివేతకు అక్కడి ప్రభుత్వం ఆదివాసీల్లోని ఒక తెగతో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసింది. దానిపేరే సల్వాజుడుం....17 నుంచి 25 సంవత్సరాలున్న యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చింది. వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా జీతం ఇచ్చింది. ఆధునికి ఆయుధాలు భుజాన పెట్టింది. కొంచెం చదువుకున్న వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించింది. వీరి నియామకాలకు ఎటువంటి నిబంధనలు ఉండవు. వారు చేసే హింసాకాండకు ఎటువంటి శిక్షలు ఉండవు. ఆదివాసీల జీవితాలను చెల్లాచెదురు చేసినా, దారుణహింసకు పాల్పడినా, ఊళ్లకు ఊళ్లనే తగుల బెట్టినా....వారిని ప్రశ్నించే హక్కు కోర్టులకు కూడా ఉండదు. కేవలం పోలీసులతో చేయించలేని కొన్ని పనులను చేయించడానికి.....మావోలను ఉక్కుపాదంతో అణిచివేయడానికే సల్వాజుడుం ఏర్పాటు జరిగింది.సల్వాజుడుంని అడ్డుపెట్టుకుని చత్తీస్గడ్ సర్కార్ చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కాదు. సల్వాజుడుం చెలరేగినన్నాళ్లూ.....ఆదివాసీల జీవితాల్లో చీకటి రోజులే.....ఆదివాసీలు నక్సలైట్లకు ఆశ్రయం కల్పించారన్న నెపంతో పసిబిడ్డల చేతివేళ్ళను నరికిన రాక్షసత్వం సల్వాజుడుం నరనరాన్న జీర్ణించుకుంది. అమాయక ఆదివాసీల మానాన్ని కాపాడే ప్రయత్నం అక్కడ పోలీసులుకూడా చేయరు. కోట్ల రూపాయలు వీరి ఆయుధాలకు, వీరి భృతికి చెల్లిస్తున్నా ఇంతవరకు ఎక్కడి నుంచి ఈ నిధులను మళ్ళిస్తున్నారో లెక్కా పత్రం ఉండదు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పరిగణిస్తున్న ఈ సల్వాజుడుం సైన్యం ఏర్పాటుకి ఎటువంటి చట్టబద్దత ఉండదు. వారికోసం చేస్తున్న ఆదాయ వ్యయాల లెక్కలుండవు. ఇదంతా ఓ అవినీతిలో భాగమేనంటున్నారు కొందరు ప్రజాస్వామిక వాదులు. అవినీతి నల్లధనాన్ని ప్రైవేటు సైన్యానికి ఖర్చుచేస్తూ బహుళజాతి కంపెనీలకు లాభం చేకూర్చేందుకేననేది వీరి వాదన. ఓ రకంగా చూస్తే ఆదివాసీలతోనే తోటివారి కన్ను పొడుస్తోంది. మట్టి తమ చేతులకు అంటకుండా చూసుకుంటోంది. ఉపాధిలేని ఆదివాసీలకు తుపాకులు ఇచ్చి, కేవలం వందల రూపాయల జీతం ముట్టజెప్పి తమ సోదరులపైకే ఉసి గొల్పుతున్నారు. వన సంపద కొల్లగొట్టే నల్లదొర కుట్రలు తెలీని ఈ అమయాక గిరిజనలు, తోటి ఆదీవాసీల ప్రాణాలను తీసేస్తున్నారు...నక్సలైట్ల అణచివేతలో భాగంగా వీరిని నియమించామని మాత్రమే ప్రభుత్వం చెపుతుంది. ఆదివాసీల గ్రామాలపైబడి వారిని భయభ్రాంతులకు గురిచేయడం. వారి ఆస్తులను ధ్వంసం చేయడం వీరి రోజువారీ కార్యక్రమం. హత్యలు, అత్యాచారాలు వీరి నిత్యకృత్యాలు. నక్సలైట్లకు ఆశ్రయమిచ్చారన్న నెపంతో గ్రామాలకు గ్రామాలనే తగుల బెట్టిన ఎస్ పిఓ లకు సర్వ హక్కులు ఉంటాయి. వారు ఏం చేసినా ఇదేమని ప్రశ్నించే హక్కు మాత్రం అక్కడి ఆదివాసీలకు గానీ ఎవ్వరికీ ఉండదు. అలా అడిగితే వారు నక్సలైట్ల కిందే లెక్క. నక్సలైట్లని పేరుంటే ఏమైనా చేసే అధికారం మాత్రం అనధికారికంగా పోలీసులకి, సల్వాజుడుంకి ఉంటుంది. అందుకే చివరకు ఏళ్ళతరబడి ఆదివాసీల కోసం స్థానికంగా పనిచేస్తున్న ఎన్ జీ ఓలు సైతం ఆ సాహసం చేయలేవు. అటువంటి సాహసం చేసిన వారికి పోలీసుల వేధింపులు తప్పలేదు.నక్సలైట్ల బూచి చూపి ప్రజలపైన, సామాన్య ఆదివాసీలు,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment