ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, August 13, 2011

ఉరి శిక్ష.. తీవ్రవాదులు.. స్వదేశీయులు... క్షమాబిక్ష..


నేరం చేసిన ముద్దాయికి కోర్టులు శిక్షలు విధిస్తాయి... శిక్షలు ఎన్నో రకాలుంటాయి.. వాటిల్లో యావజ్జీవ కారాగార శిక్ష పెద్దదయితే.. దానికి మించిన కాపిటల్ పనిష్మెంట్ ఒకటుంది. అదే ఉరిశిక్ష... ఒకసారి సుప్రీంకోర్ట్ ఉరిశిక్ష ఖరారు చేసిందంటే ఇక అప్పీల్ చేసుకోడానికి ఏ కోర్టూ ఉండదు.. ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉరిశిక్ష పడ్డ నేరస్థులను కాపాడే అధికారం ఉంది. రాష్ట్రపతి కనికరించకుంటే నూకలు చెల్లినట్టే.. ఈ మద్యకాలంలో ఉగ్రవాదులకు సుప్రీంకోర్టు పలువురికి మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్డు ఉరిశిక్ష విధించిన వారిలో ఎంతమందిని ఉరి తీశారు. ఎంతమందికి క్షమాబిక్ష పెట్టారు.. ఉరిశిక్ష పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
చి'వురి' శిక్ష
దేశ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన వారికి... ఎర్రకోట సమీపంలో సైనిక శిబిరం పై దాడి చేసిన తీవ్రవాదులకు... పార్లమెంట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు.. ముంబయిలో మారణ హోమం సృష్టించిన టెర్రరిస్టుకు.. అత్యున్నత న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.. ఈ శిక్షలన్నీ అమలవడానికి ఎంత కాలం పడుతుంది.. అసలు ఈ నేరస్థులు ఉరికంభం ఎక్కుతారా... లేక క్షమాబిక్ష పేరుతోనో... హైజాక్ ల పేరుతోనో బిగిసిన తాడును తప్పించుకుంటారా... ఇదే ఇప్పుడు యావత్ భారతం మదిలో మెదులుతున్న ప్రశ్నలు.దేశ సరిహద్దుల దాటి... రకరకాల రక్షణ వలయాలు ఛేదించుకొని... జన సమ్మర్ధాలను చేరుకొని దేశ రక్షణ వ్యవస్థకే సవాలుగా నిలిచిన మూకలవి... వారికి దేశ నాయకుడైనా... మామూలు పౌరుడని తేడా లేదు.. తీవ్రవాద ముసుగులో పచ్చి రక్తాన్ని రుచి మరిగిన ముష్కర మూకలు... వీరు అన్నెం పున్నెం ఎరుగని అమాయక ప్రజల పై బుల్లెట్ల వర్షం కురిపిస్తారు... దేశ చట్టాలను రూపొందించే పార్లమెంట్ లో జొరబడి ప్రజా ప్రతినిధులను గడగడ వణికిస్తారు.. ఎర్రకోట దగ్గర కవాతు చేసే సైనిక శిభిరాల పై దాడికి తెగబడతారు... దేశ భద్రతనే సవాలు చేసే ఈ కసాయి మూకలనేం చేయాలి... ఏ శిక్ష వేస్తే వీరికి సరిపోతుంది... ఈ ప్రశ్నకు యావత్ భారత జాతి ఠక్కున చెప్పే సమాధానం.. మరణ శిక్ష.. అవును రక్తం రుచి మరిగిని ఈ కిరాతకులకు వెయ్యాల్సింది మరణ శిక్షే.. ఆ శిక్ష ఎంత త్వరగా అమలు చేస్తే... అంత మంచిది.. మరొకరు ఈ పనికి పూనుకోవాలంటే వణికిపోవాలి.. వీలైతే అంత కిరాతకంగా శిక్షించాలి.. కానీ మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం... ఇక్కడ శిక్ష వేయాలంటే... విచారించాలి.. నేరం రుజువు చేయాలి.. ఆ తరువాత శిక్ష విధించాలి.. తరువాత ఒక కోర్టు నేరస్థుడని రుజువు చేసినా మరో కోర్టులో న్యాయాన్ని కోరొచ్చు.. అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పాక కూడా రాష్ట్రపతిని రక్షించమని వేడుకొనే సౌకర్యం ఉంది.. ఇన్ని సోపానాలు దాటుకుంటూ వెళ్లే సరికి.. ఏదో ఒక బ్లాక్ మెయిల్ కు దిగి మన చేతుల్లో బందీలుగా ఉన్న నేరస్థులను విడిపించుకునే తెగువా వారికి ఉంది... అవును ఇప్పుడు మన జైళ్లలో ఉరిశిక్ష పడి.. ఉరికంబం ఎక్కడానికి సిద్దంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య పదుల సంఖ్యలో నిరీక్షిస్తోంది... వీరందరినీ ఉరి తీసేదెప్పుడు.. అసలు ఉరిశిక్ష పడ్డ నేరస్థుడిని ఎంత కాలానికి ఉరి తీస్తారు... భారత దేశంలో ఎంత పెద్ద తప్పు చేసినట్టు రుజువయినా...యావత్ జీవ కారాగార శిక్ష మాత్రమే విధిస్తారు. కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం కాపిటల్ పనిష్మెంట్ గా పిలిచే మరిణదండన విధిస్తారు. అతికిరాతకంగా హత్య చేసిన వారికి... మూర్ఖత్వంతో వ్యవహరించి పాశవికంగా సమూహ హత్యలకు పాల్పడ్డవారికి... మానవత్వాన్ని మరిచి... మానవజాతి తలదించుకునే కిరాతకానికి పాల్పడ్డ వారికి.. దేశ భద్రతనే ప్రశ్నార్దకంగా మార్చిన ఉగ్రవాదులకు ఉరిశిక్షను విధించిన సందర్భాలున్నాయి.. అయితే ఈ ఉరిశిక్షలు ఇప్పటివి కావు.. ఎన్నో వందల సంవత్సరాల నుంచి.. రాజులు.. సుల్తానులు.. ప్రభుత్వాలు విధిస్తున్నవే..భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1983 నుంచి అరుదైన కేసుల్లో ఉరి శిక్ష విధించొచ్చని తెలిపింది. పాశవికంగా హత్యచేయడం, దోపిడీ హత్య, దేశ భద్రతకు ముప్పు కలిగించడం వంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఎన్నో సార్లు ఉరిశిక్షలు విధించింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ధనుంజయ్ చటర్జీ 1990 సంవత్సరంలో... 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టు నేరం రుజువు కావడంతో అతనికి కలకత్తా కోర్టు ఉరిశిక్ష విధించింది. రాష్ట్రపతి క్షమాబిక్ష తిరస్కరించడంతో ఆగస్టు 14, 2004న ఉరితీశారు.. చటర్జీ బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించడంతో ప్రభుత్వమే దహనం చేసింది... రాష్ట్రంలో హైకోర్టులు కూడా ఉరిశిక్షలు విధించిన సందర్భాలున్నాయి. ఈ మద్యకాలంలో నెలరోజుల పసికందును ఆడపిల్ల అనే ఒకే ఒక కారణంతో హత్య చేసిన తండ్రికి విశాఖ కోర్టు ఉరిశిక్ష విధించింది. సహరించిన తల్లికి జైలు శిక్ష విధించింది. చెన్నై లో వరుస హత్య కేసులో ఆటో శంకర్ ని నేరస్థుడిగా నిర్ధారిస్తూ సుప్రీకోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. ప్రజా ప్రతినిధుల పిల్లలను కిడ్నాప్ చేసి... రేప్ చేసి... హత్య చేసి ఇళ్ల మధ్యలో పాతిపెట్టిన సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు శంకర్ ను అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు.. పోలీసులు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించడం వల్ల శంకర్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది.. శంకర్ ను ఏప్రియల్ 27, 1995 ను ఉరితీశారు. ఆటోశంకర్ కేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది..ిఇలా చెప్పుకుంటూ పోతుంటే స్వతంత్ర భారతంలో నేటికి 55 మందికి మాత్రమే ఉరిశిక్ష అమలు చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.


రాష్ట్రపతి క్షమాబిక్ష జాబితాలో ఎన్నో కేసులు నిరీక్షిస్తున్నాయి. రాజీవ్ గాంధీతో బాటు, 14 మందిమరణానికి కారకులైన ముగ్గురు నిందితులు మురుగన్, శంతన్, పెరారివాలన్‌లు కూడా క్షమాబిక్ష జాబితాలో ఉన్నారు. వీరికి రాష్ట్రపతి క్షమాబిక్ష నిరాకరించింది.. ఈ ముగ్గురికి ఉరి తప్పదు.. వీరితో పాటు ఉన్న నళిని గర్భవతి కావడం వల్ల.. ఆమెను సోనియా గాంధీ క్షమించడంతో ఉరితాడు తప్పింది... 9 మందిని హతం చేసి 31 మందిని గాయపరిచిన ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ టెర్రరిస్టు దేవిందర్ సింగ్, 21 మందిని పొట్టన బెట్టుకున్న గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నలుగురు అనుచరులు, అమృత్ సర్ లో వరస హత్యలకు పాల్పడ్డ హంతకులకు, మంగుళూరులో కుటుంబ సభ్యులు నలుగురిని హత్య చేసిన ప్రవీణ్ కుమార్‌కు, గోద్రాలో రైలుకు నిప్పంటించి 58 సజీవదహనానికి పాల్పడిన 11 మందికి, ఇలా ఇదో ఉరితాడంత జాబితా ఉంటుంది. వీరంతా రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు.. క్షమాబిక్ష లిస్టులో ఉన్న వారిలో చాలా మంది సహజ మరణంతో చనిపోయిన వారు కూడా ఉన్నారంటే మరణశిక్ష విధింపులో ఎంత జాప్యం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా దేశ భద్రతనే సవాలు చేసే విధంగా ఏకంగా పార్లమెంట్ పై, ఎర్రకోట పై దాడికి పాల్పడ్డ తీవ్రవాదులకు కూడా సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2000 సంవత్సరంలో ఎర్రకోట సమీపంలో సైనిక శిబిరం పై దాడి చేసిన పాకిస్థానీయుడు ఆరిఫ్ కు ఢిల్లీ కోర్టు, సుప్రీంకోర్టులు మరణ శిక్ష విధించాయి. 2001లో పార్లమెంట్ పై దాడి కేసులో కీలక సూత్రధారి అఫ్జల్ గురుకు కూడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అబ్జల్ గురు క్షమాబిక్ష రాష్ట్రపతి చేతిలో ఉందని కేంద్రం తెలపింది. ముంబయిలో మారణహోమానికి పాల్పడ్డ అజ్మల్ అమీర్ కసబ్ కు కూడా కోర్టు ఉరిశిక్ష విధించింది. రాష్ట్ర పతి వద్ద ఇప్పటికే 29 క్షమాబిక్ష కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. వీటిని పరిష్కరించాకగానీ ఉగ్రవాదులకు శిక్ష అమలయ్చే అవకాశం లేదు. ఉగ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాబిక్ష లభించదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ప్రత్యేక చొరవతో వీళ్ల ఫైలుకు కదలిక వస్తే శిక్ష అమలుచేసే అవకాశం ఉంది. ఉరిశిక్ష విధించగానే అక్కడితో కథ సమాప్తం కాదు. కిందికోర్టు శిక్ష విధిస్తే హైకోర్టుకు, అక్కడ కూడా శిక్ష ఖరారు చేస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టు కూడా ఉరిని ఖాయం చేస్తే.. రాష్ట్రపతి క్షమాబిక్ష పొందే అవకాశం ఉంది. రాష్ట్రపతి దగ్గర వెయిటింగ్ లిస్టు చాలానే ఉంది. ఇవన్నీ పరిష్కారమై ఉరి అమలు చేసే సమయానికి చాలా మంది సహజ మరణాన్ని పొందిన వారున్నారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2001లో ౩౩ మందికి, 2002లో 23 మందికి, 2005లో 77 మందికి, 2006లో 40 మందికి , 2007లో వంద మందికి ఉరిశిక్ష పడింది. వీరందరూ రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం ఎదురు చూస్తున్నవారే. కింది కోర్టుల్లో మరణశిక్ష విధించబడిన చాలా మంది ముద్దాయిలకు రాష్ట్ర హై కోర్టు.. లేదా సుప్రీంకోర్టులు వాటిన యావత్ జీవ కారాగార శిక్షగా మార్చిన సందర్బాలు కోకొల్లలు.. ముద్దాయి నేర చరిత్రను బట్టి కోర్టు శిక్ష మార్పు చేస్తుంది. మరణ శిక్ష ను విధించడానికి ఇప్పటి వరకు ఉరి పద్దతినే అవలంబిస్తున్నారు.. పురాతన కాలంలో గ్రీకులు మరణ శిక్ష విధించాలంటే విషపు పాత్రను అందిచే వారు.. ఆ విషం తాగిన వ్యక్తి బెడ్ పై పడుకుంటే కాళ్లనుంచి చచ్చుబడుకుంటూ వస్తాయి.. పాదాల నుంచి స్పర్శ మాయమై చివరకు గొంతు వరకు స్పర్శ రహితమవుతుంది.. అప్పటి వరకు వ్యక్తికి ఎటువంటి బాధ కలుగదు.. ఆఖరు క్షణంలో మెదడు పనిచేయడం మానేసి కోమాలోకి వెళ్లి మరణిస్తాడు. సోక్రటీస్ కు గ్రీకులు విధించిన శిక్ష ఇటువంటిదే.. ఉరి శిక్షలో మనిషి కొంత సేపు బాధతో విలవిల్లాడుతాడు.. నరకయాతన అనుభవించి మరణిస్తాడు.. అందుకే ఈ శిక్షను సవాలు చేస్తూ 1983లో పౌరసంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కానీ సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చింది. ఉరి విధింపులో ఎటువంటి అవమానకర పరిస్తితులు ఉండవని తెలిపింది.. మరణశిక్షకు ఉరితీతనే అనుసరిస్తున్నారు.




No comments:

Post a Comment