ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, September 25, 2009

కులాల వివరాలు జనాభా లెక్కల్లో

కులాల జనాభా అంశం తాజాగా తెరపైకి వచ్చింది.జనాభా సేకరణలో కులాల వివరాలు ఉండితీరాలనే వాదన రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటి వరకూ మన దేశంలో 1931లో బ్రిటీష్‌ వారు సేకరించిన వివరాలను బట్టి కేటాయింపులు జరుగుతున్నాయి. బిసిలకు సంబందించి సంక్షేమనిధులు కేటాయించాల్సి వచ్చినప్పుడల్లా ఇదే వివాదం వెంటాడుతోంది. 1931లో బ్రిటీష్‌వారు జనాభా లెక్కల్లో కులాలను చేర్చడం ఒక కుట్రగా మన జాతీయ నాయకులు అభివర్ణించారు. మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం కాబట్టి కులమతలకతీత మైన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటామని నాటి నాయకులు కలలు కన్నారు. కానీ నేడు కులాల ప్రభావం సమాజంలో తీవ్రంగాఉంది.వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లకు నిధులు కేటాయించ వలసి వచ్చినపుడల్లా సమాజంలో బిసిల శాతమెంత అనే సందేమం తలెత్తుతూనే ఉంది. అయినా వీరికి సంక్షేమ నిదులు కేటాయించాల్సి వచ్చినా, రిజర్వేషన్‌లు కేటాయించాలన్నా 1931లెక్కల ప్రాతిపదికనే కేటాయిస్తూనే వస్తున్నారు. దీనిలో ఉన్న ఔచిత్యమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే కులాల వారీగా వివరాలు సేకరించడానికి ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిఎంకే అభ్యర్దనను సుప్పీంకోర్టు తీర్పుచెప్పింది. దీని వల్ల సామాజిక విద్వేషాలు పెరుగుతాయని అభిప్రాయపడిది. మండల కమీషన్‌ తమ సూచనలు చేసే ముందు కులాల వారీ జనాభౠ సేకరణ జరపాలని వరుసగా ముగ్గురు హోం మంత్రులను కోరింది. అయితే 1951 నుంచి కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలు సేకరించ కూడదన్న నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిర్ణయానికి కేంద్రప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉంది. జనాభా లెక్కలు సరిగా లెకపోవడం వల్ల ప్రతి సామాజిక వర్గం తమ జనాభా లెక్కలు ఎక్కువ చేసి చెప్పుకుని రాజకీయంగా, ప్రభుత్వ పథకాల్లో వాటాలు అధికంగా పొందుతున్నారనే వాదన ఒక వైపుఉంటే, ఎప్పుడో వేసిన లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని తమకు సరియైన ప్రాతినిధ్యం కల్పించడం లేదనే వాదన కూడా ఉంది. అయితే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తే కులవిద్వేషలు రెచ్చగొట్టినట్టు ఉంటుంది, కావున సమాజంలో ఆర్దిక అసమానతలు రూపుమాపాలంటే , భిన్న సామాజిక వర్గాలలో ఆర్దిక స్థితిగతులను సర్వే చేయాలన్న ప్రతిపాదన కూడా తెరపైకొచ్చింది. దీని ద్వారా ఆర్దిక అసమానతలు రూపుమాపవచ్చని, కేవలం కులాల వెనకబాటు కాకుండా ఆర్దిక వెనకబాటు నుండి రక్షించాలన్న వాదన రోజురోజుకూ బలపడుతోంది. ప్రతీసారీ ప్రభుత్వానికి ఇదో కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే అభివృద్ది చెందిన కొన్ని బి.సి కులాలను ఓసిల్లో కలపాలనే నిర్ణయానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. అలాగే కొన్ని కులాలను బి.సి జాబితాల్లో కలపాలనే నిర్ణయానికి కూడా సరియైన లెక్కలు లేవు. ఎందుకంటే ఏ కులంలో ఎంతమంది ఉద్యోగులున్నారు, ఎంతమంది సామాజిక ఆర్దికంగా బలపడ్డారు అనే అంశాలకు సంబందించిన సమాచారం ప్రభుత్వం వద్దలేనేలేదు. దేనికైనా బ్రిటీష్‌ వాళ్ల లెక్కలపై ఆధారపడాల్సిందే. దీని వల్ల అనేకరకాలయిన న్యాయపరమైన చిక్కుల వివాదాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ 2011లో జనాభా లెక్కలు సేకరించాల్సిన తరుణం ఆసన్నమయింది. ఇప్పుడయినా ఈ సమస్యను అదిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 2011లో సేకరించబోయే జనాభా లెక్కల్లో కులం వివరాలు ఉండేలా చూడాలంటే కేంద్రన్యాయ శాఖా మంత్రి వీరప్పమెయిలీ ప్రధానికి లేఖ రాయడంతో ఈ చర్చ ఇప్పడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Friday, September 18, 2009

నా ఫోటో ఇది కూడా

నా ఫోటో ఇది కూడా

నా ఫోటోలు

Monday, September 14, 2009

రాజాలా బతికిన రోజాకు గడ్డు కాలం

చంద్రబాబు నాయుడికి టాటా చెప్పిన రోజాకు కాంగ్రెస్ లో వెల్ కం చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోయారు. ఆమె నిర్ణయం తీసుకున్న సమయం సరిగ్గాలేదు. ఒక నెల ముందు అయితే వైఎస్ ఆమెకు ఆహ్వానం పలకమని తన మనుషులను పురమాయించి ఉండేవారు.తెలుగుదేశం తరఫున గత ఎన్నికల్లో చక్కగా గళం విప్పిన రోజా ఇప్పుడు ఆ పార్టీని వీడిపోవడం చంద్రబాబు నాయుడికి బాధాకరమే.రోజాకు తెలుగుదేశంలో ఆదరణ పోవడానికి ప్రధాన కారణం నన్నపనేని రాజకుమారి అని తెలుస్తోంది. రెడ్డి కులస్ధురాలైన రోజా కాంగ్రెస్ కోవర్టులా తెలుగుదేశంలో వ్యవహరిస్తోం<దని ప్రచారం ఉధృతం కావడంతో ఉక్కిరి బిక్కిరై రోజా టిడిపికి గుడ్ బై చెప్పవలసి వచ్చిందని తెలుస్తోంది. చాలా గట్టి అభ్యర్ధి అయిన గల్లా అరుణకుమారి మీద తనను నిలబెట్టడం కుట్రలో భాగమేనని రోజా ఆలస్యంగా తెలుసుకుంది. ప్రత్యక్ష రాజకీయాలకు కొంచెం కొత్త్తే అయిన రోజాకు ఎన్నికల సమయంలో ఈ విషయం తెలిసినట్టు లేదు. తెలుగుదేశం గుడ్ విల్, తన గ్లామర్ కలిసి తనను సులభంగా గట్టెక్కిస్తాయని ఆమె భావించారు. గల్లా అరుణ కుమారిపై రోజా గెలవలేదన్న విషయం చంద్రబాబు నాయుడికి ముందే తెలుసు. బరిలోకి దిగిన రోజా గ్లామర్ ను, కొంత సంపదను కోల్పోయింది.ఆడవారికి ఆడవారే శత్రువులు అన్న సామెతను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని, మహిళారాజ్యం నాయకురాలు శోభారాణి నిజం చేసి చూపారు. రోజాది ఐరన్ లెగ్ అని ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం రోజాకు బాధ కలిగించి ఉండవచ్చు. ఆనాడు ఆమె తెలుగుదేశం లో చేరిన వెంటనే చంద్రబాబు నాయుడు అలిపిరి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే వైఎస్ మరణించారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి గంగాభవాని, రాజకుమారి, శోభారాణి కారకులని రోజా భావిస్తున్నట్టు సమాచారం. మంచి భవిష్యత్తు ఉన్న యువ రాజకీయ నాయకురాలి ఆశలను ఇలా సీనియర్లు భగ్నం చేయడం తప్పే.ఈ దెబ్బతో రాజకీయాల మీద ఆసక్తి కోల్పోయిన రోజా సినిమాల మీద టీవీ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.

Monday, September 7, 2009

రాజకీయ వ్యభిచారం

రాజకీయాల్లో విలువలు ఏనాడో మట్టి కొట్టుకు పోయాయి. ఇప్పుడు ఏ మనిషి మనవాడో ఎవరు ఎప్పుడు పగవాడవుతాడో చెప్పడం అసాధ్యం అయిపొయింది. ఎంతో ఆర్భాటంగా పార్టీ పెట్టిన వెండితెర మెగాస్టార్ చిరంజీవి, పార్టీ నుంచి సరిగ్గా ఎన్నికల ముందు ఎంతో మంది విడిపోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం మీద బాగా చెప్పగలరు. ఎంత త్వరగా పార్టీ లోకి వచ్చారో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిన నాయకుల చిట్టా తీస్తే చిరంజీవి కూడా ఇంకా బాగా చెప్పగలరు. ఫిరాయింపుల్ని చిరంజీవి ప్రోత్సహించక పోయినా కోవర్టులుగా కొంత మంది నాయకులని చంద్రబాబు పంపించిన మాట వాస్తవం అయ్యే విషయాన్నీ మనం కొట్టిపారేయలేము. అలాగే టీ.డీ.పీ కి ఒక కవచం లాగ కొమ్ము కాసిన నాయకురాలు రోజా ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. చిరంజీవిని చెడామడా తిట్టి అధినేత మెప్పు పొంది ఎన్నో సార్లు మీడియా సాక్షిగా సామాన్య ప్రజానీకంయొక్క ఛీత్కారాలకు గురైన మాజీ నటి రోజా, చంద్రబాబు మన్ననలు పొంది, చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కోసం ఎం.ఎల్.ఏ టికెట్ పొందింది. ఈమె కోసం సాక్షాత్తూ సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ని కూడా పక్కనెట్టాడు చంద్రబాబు. అయినా అధికార పార్టీ విజయం తో సీట్లు కోల్పోయిన చాలా మందిలో రోజా ఉంది. ఆమె పెట్టిన శాపనార్దాల వల్లనేమి, లేదా తన చరిష్మా వల్లనేమి పక్కనున్న తిరుపతి నియోజకవర్గంలో చిరు గెలుపొందారు. అలాగే రోజా కి, ప్రజారాజ్యం నాయకురాలు శోభారాణి కి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎవరు మర్చిపోరు. అంతగా టీ.డీ.పీ ని వెనకేసుకొచ్చిన రోజా అసలు కాంగ్రెస్ లోకి దూకనున్నదని సాక్షాత్తు ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి చెప్పటం దాన్ని రోజా ఖండించడం జరిగిపోయాయి. అయినా ఈ విషయం జనం దృష్టి నుండి వెళ్ళకముందే మళ్ళీ ఈ రోజు రోజా ముఖ్యమంత్రిని కలవడం ఆ తరువాత ఆమె మాటలు వింటుంటే ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ లో చేరనున్నదనే తెలుస్తోంది. తన సోదరులు తో పాటు, మాజీ టీ.టీ.డీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ల తోడుగా రోజా ముఖ్యమంత్రిని మీడియా సాక్షిగా కలిసింది. అయితే ఆమె చెప్పేదేమిటంటే చిత్తూరు జిల్లాకి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సాధించిన తరుణంలో కృతఙ్ఞతలు తెలియచేయడానికి కలవడం జరిగిందని చెప్పినా ఆ తరువాత మీడియా ముందు ఆమె మాట మార్చింది. టీ.డీ.పీ ని తన బిడ్డలకన్నా ఎక్కువ ప్రేమించానని అయితే సొంత పార్టీ తనకు తగిన రీతిలో గౌరవం ఇవ్వలేదని అలాగే సొంత పార్టీ వ్యక్తులే తనను ఓడించారని దీనితో తాను మనస్తాపం చెందానని తెలిపింది రోజా. అలాగే తాను ఎన్నికలవేళ ముఖ్యమంత్రిని ఎంతగా విమర్శించినా ఆయన తనను ఎంతో ఆదారంగా కలిసి మాట్లాడారని ఆయన (వై.ఎస్.ఆర్) సొంత మనుషులను బాగా చూసుకుంటారని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మిన వాళ్ళను వదలరని కూడా కితాబిచ్చింది. దీన్ని బట్టి ఆమె త్వరలో పార్టీ మారబోతోందని రూఢీ అయిపొయింది. అంతటితో ఆగక టీ.ఢీ.పీ లో తన సామాజికవర్గం వారికి తగిన ప్రాతినిధ్యం, గౌరవం లేవని కులరాజకీయాల తోనే తనను సొంత పార్టీ మనుషులే చంద్రగిరిలో ఓడించారని ఆరోపిస్తోంది. అయితే ఒక్క విషయం ఏమిటంటే ఒకటే కులం అయిన నన్నపనేని రాజకుమారి ని పక్కన పెట్టి తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని రోజాకు రెడ్డి సామాజిక వర్గానికి (రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి) కట్టబెట్టిన చంద్రబాబు ఇప్పుడు తన తప్పు తెలుసుకుని ఉంటారు. పక్కిల్లు తగలబెట్టేటప్పుడు మన ఇల్లు కూడా అంటుకునే అవకాశం ఉందని చిరంజీవికి కుల రాజకీయాలు ఆపాదించినప్పుడు ఏమీ మాట్లాడని, ఆమెను ఖండించని చంద్రబాబు ఇప్పుడు అవే వ్యాఖ్యలతో తనపైనే దాడి చేసినప్పుడు తప్పకుండా తెలుసుకుని ఉంటారు.రోజా లాంటి వ్యక్తులు రాజకీయాలకే మాయని మచ్చ. ఆమెని చేర్చుకునే పార్టీ ఏదైనా ఏదో ఒక రోజు తప్పకుండ చింతించవలసి వస్తుంది. రాష్ట్రానికి గాని, ప్రజలకు గాని చంద్రబాబు ఎమన్నా చేసారో లేదో తెలీదుకాని, రోజాకు మాత్రం ఎప్పుడూ మంచి స్థానం ఇచ్చారు అదీ 2004 ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా కూడా ఇంతకంటే ఏమి చేస్తారు ఎవరైనా? కనుక ఇప్పుడు రోజా ఆపదిస్తున్న కుల రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలు అన్ని కూడా ఒక పాముని పెంచి పోషించిన చందం అని టీ.డీ.పీ నాయకులు అనుకోక తప్పదు. ఇప్పుడు కూడా పార్టీ మారడం వెనుక స్వార్ధం తప్పించి వేరొక కారణం లేదని గ్రహించలేని అమాయకులు కాదు జనం. తన వివాదాస్పద వైఖరితో తన రాజకీయ భవిష్యత్తుకి తానే సమాధి కట్టుకుంటున్న రోజాని చూసి జాలి పడడంకూడా వృధా !! ఇటువంటి రాజకీయ వ్యభిచారం ప్రజలకు దూరం చేస్తుంది తప్పించి మెప్పు తెచ్చే అవకాశం లేదు. మరి ఈ విషయం రోజా ఎప్పుడు గ్రహిస్తుందో?

Sunday, September 6, 2009

తమ్మినేనికిదేం పోయేకాలం?

తమ్మిమ్మినేని వీరభద్రంలో ఉన్నా పైశాచిక లక్షణం మరోసారి బయటపడింది. మనది కాకుంటే మసి కావాలనే మనస్తత్వం ఆయనదని అతనే రుజువు చేసుకున్నాడు. వై ఎస్ అకాలమరణం సెంధదని కార్యకర్తలంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈయన మాత్రం పండగ చేసుకుంటున్నాడు. మమ్మల్ని డీ కొంటె మాంసం ముద్దలే అని వైఎస్ నుద్దేశించి అనడం ఆయన విగ్నతః కే వదిలేద్దాము.

రాష్ట్ర రాజకీయాలు రాజశేకరుడికేందుకు

జగన్ మెహర్బానీ కోసం అందరు తాపత్రయ పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి హీరో రాజశేకర్ చేరాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్ వుంటేనే బాగుంటుందని బాకా వుడుతున్నాడు. కొంప దీసి చిరంజీవి ముఖ్యమంత్రి అయి పోతాడని బయం పట్టుకుందేమో. ఇతగాడు ఒక అడుగు ముందుకేసి వై ఎస్ పై సినిమా తీసేందుకు సిద్దమయ్యాడు కార్యకర్తలంతా చూసిన సినిమా హిట్ అవుతుందని ఫీలింగ్ కాబోలు. గోద్దోడు గొడ్డు కేడుస్తుంటే మాల పుల్లయ్య చియ్య కేడ్చాడట. అలాగుంది ఇతగాడి నిర్వాకం. అయ్యా యాంగ్రీ స్టార్ కొంపదీసి నోరు జారితే ఈసారి శాల్తి గల్లంతే. ఎవడైతే నాకేంటి అనుకుంటావా ఇక నీ ఇష్టం.

Saturday, September 5, 2009

మంత్రి వర్గ ప్రమాణం పై మల్లగుల్లాలు

వై యస్ మరణం తరువాత రాష్ట్ర మంత్రి వర్గం రద్దయింది. దీంతోఉన్నామంత్రులు మల్లి ప్రమాణ స్వీకారం చేయాలా వద్ద అన్నా విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.

రోజాకిదేం రోగం

బెల్టు షాపులతో మద్యాంధ్ర ప్రదేశ్ చేసి,మగువల తాళి బొట్లు తెగిపడేలా చేస్తున్నారంటూతెగనాడింది తెలుగు నారి హోదాలో రోజా.
ఉన్నట్టుండి రోజా ‘చేతికి’ చిక్కితెలుగు తమ్ముళ్ల సైకిల్ దారిలో ముల్లై పంచర్లు చెయ్యడానికీ సిద్ద పడుతోంది.ఎవడెక్కువ తిడితే వాడికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, రాజకీయాల్లో ఎవరెక్కువతమను తిడితే వారిని తమ సిగలో తురుముకోవడం ప్రత్యర్ధి పార్టీల బాధ్యతగా ప్రవర్తిసున్నారు.కానీ రోజా ఉన్నట్టుండి తనకున్న సహజ రాజకీయ వాసనతో అధికారంలో ఉన్నచేయిలో పడి ఎప్పుడూ తిట్లతో ఆకర్షించడం మాని తానేఆకర్షణకులోనై మై మరచి అడ్డంగా పొగడ్డమే ప్రజలకు వింతగొలుపుతోంది.కానీ ఆలోచిస్తే బెల్టు తీయమన్న రోజా బెస్ట్ అన్నందుకు అభినందించి తీరాలి.ఆ బెల్టు షాపులు లేక పొతే ఈ రోజు ఇంకా ఎక్కువ ఆత్మహత్యలు జరిగేవి.కరువులో కడుపు రగిలే వాడు కడుపారా తాగడానికి,వాన దేవుడిని చైనా నుండి తిరిగి రప్పించిన మన దేవునికిమంది మద్యం తాగడం ప్రీతికరం ఆ మొక్కుబడిని ప్రజలు తేలిగ్గా చెల్లించడానికి,అసెంబ్లీలో జరిగే ఆటలతో ఆనందించడానికి,స్వైన్ ఫ్లూ వణుకును తగ్గించుకోడానికి,చికన్ గున్యా కీళ్ళ నొప్పుల నివారణకు,డెంగీ దోమకు మత్తెక్కించడానికి,ఇలా అడుగడుగునా ఉపయోగపడుతున్న బెల్టు, ఇప్పుడు ఖచ్చితంగా బెస్టే.మరి ఆ బెల్టును ప్రసాదించిన దేవుడి చేతిలోకి రోజా చేరి,ఇంతకు మునుపు పూజకు పనికి రాని పూవుఅన్న వారి నోళ్ళు మూతపడేలా చేస్తుంటే, ముచ్చటేస్తోంది.

నా స్తైలింతే

ఊరందరిది ఒక దారైతే వులిపి కట్టేది మరో దారి. కొత్తగా రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తేనే పది మందిలో ప్రత్యేకత వుంటుంది. వారికే సమాజంలో విలువ వుంటుంది. అలా చేయగలిగిన వారే జీవితంలోసక్సెస్స్ సాధించగలరు.

పోయినోల్లందరు మంచోళ్ళు

నిన్న మొన్నటి దాక రాజశేఖర్ రెడ్డి ని తిట్టినోళ్ళంతా ఇప్పుడు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులూ కూడా వై ఎస్ ను ప్రశంసిస్తున్నారు. కారణం. పోయినోల్లందరు మంచోళ్ళు. వాళ్ళు చేసిన పనులన్నీ గొప్పవి.

నా అభిప్రాయం ఇది.


ఈ సృష్టి లో అనేక నక్షత్రాలు, గ్రహాలు వున్నాయి. అవి ఎప్పుడు దారి తప్పుతాయో తెలీదు. అవి ఎప్పుడు భూమి మీదకు వస్తాయో తెలీదు. మనం బ్రతికున్నంత కాలం ఈ భూమిని కాపాడుకుందాం .



For the peaceful atmospher. and pull the air into bladder. so happy. with salty oxygen.

Always your concentration on erodication of curruption not on Human beings. they are always with us in the part of society.

BEST Example For Dare

He is the Star in my Heart. thats all.

channel upcoming

It's a NEWS channel upcoming. it is more peculor than other news channels. letus see and enjoy.
Add Image

story