ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, May 3, 2012

ప్రాణాలు తీస్తున్న....బ్రాందీ రాజ్యం..

ప్రాణాలు తీస్తున్న....బ్రాందీ రాజ్యం..
ఇరవై ఏళ్లకే అరవై ఏళ్ల వాళ్లలా మారుతున్న యువత నిత్యం మత్తులో మునికి చిత్తైతున్న జీవితం ఈ రాష్ట్రంలో మంచినీళ్లకు నిత్యం కరువు... ప్రతి సంవత్సరం పోటుగాళ్లమని చెప్పుకునే కుహనా రాజకీయ వేత్తలు.. కన్నీళ్లు తీరుస్తాం.. దాహం తీరుస్తామని.. ఆ ఎన్నికలపుడు గొంతులో కాసిన్ని మందు నీళ్లు పోసి ఓట్లు రాల్చుకుంటారు. కానీ ఆ ఒక్కరోజు మందుతాగి బృహన్నల గాళ్లకు ఓట్లేసిన ఓటరు కనీసం ఊహించలేడు.. మళ్లీ ఐదేళ్ల వరకు మన గుమ్మం వైపు తొంగి కూడా చూడడని. భవిష్యత్తులో మందు దొరుకుంతుందిగానీ మంచినీళ్లు దొరకవని.. అవును ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఏ ఊళ్లో చూసినా సాయంత్రమైతే.. బెల్టు షాపులు తిరునాళ్లను మించిన హడావుడితో కనిపిస్తున్నాయి. మూతి మీద మీసం మొలవని నడమంత్రపు నాయాళ్లు.. బీర్లకు బీర్లు ఆబగా లాగించేస్తున్నారు. ఈ బీర్లు కూడా పచ్చి స్పిరిట్ లాగా కంపు కొడుతున్నా కూలింగ్ టచ్‌లో, మిర్చీ ఘాటులో ఆ విషయం పట్టించుకున్న మందుబాబు లేరు. గతంలో బీరంటే బార్లీ రసం కాబట్టి కాస్త ఆరోగ్యానికి పనికొస్తుందనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం గ్యాస్ నింపిన స్పిరిట్ లా బీర్లు కంపుకొడుతున్నాయి. బ్రాండేదయినా సరే.. కాలేయం, లివర్, మూత్రపిండాలను రోజుకు కొంచెం కొరుక్కు తినేవే.. అసలు మన రాష్ట్రంలో అమ్మే మద్యానికి ఏదైనా కండీషన్లు ఉన్నాయా.. మద్యాన్ని ప్రమాణాల ప్రకారం తయారు చేస్తున్నారా అని చూసే నాధుడే లేదు.. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో బీర్ షాటేజీ వచ్చి కొత్త బీర్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయంటే.. రాష్ట్రంలో తాగుబోతుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో అర్ధ:ం చేసుకోవచ్చు.. మంచికీ.. చెడుకీ.. మధ్య వారధి మద్యమే.. ఏదన్నా సమస్యా.. లేదా ఎవర్నాన్నా దేనికైనా ఒప్పించాలా... లేదా ఎవణ్ణన్నా బెదిరించాలా.. వీటన్నిటికీ ఒకటే మందు.. అదే పెగ్గు నుంచి మగ్గుదాకా అంటే పీకలదాకా పోసే మందు.. ఇది ఉంటే చాలు.. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు మాట వింటారని ఒక ప్రచారం.. అందుకే సాయంత్రమైతే చాలు మసక వెలుగులో.. లేత గొర్రె పిల్లల మాంసం నంజుకొని తింటూ సెటిల్ మెంట్లను చేసుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నారు. తేడా వస్తే అదే మత్తులో ముంచి తీరిగిరాని లోకాలకు చేరుస్తున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రాష్ట్రంలో ఏటా అధికారిక లెక్కల ప్రకారమే వేలాది మంది మద్యానికి బానిసై చనిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోడ్డు వెంట ఫూటుగా తాగి ఒంటి పై బట్టలు లేకుండా దుబ్బలో వ్యక్తి పడుకున్న దృశ్యం కనపడని ఊరు లేదు.. ఎందుకిలా....? హైటెక్ వేగంతో దూసుకుపోతున్నామని చెప్పుకుంటున్నాం.. ఆకాశానికి నిచ్చెన వేశామని జబ్బలు చరుచుకుంటున్నా.ం.. కానీ పాతాళానికి.. అదో:పాతాళానికి జారిపోతున్న విషయం గ్రహించడం లేదు. రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం.. పదవిని కాపాడుకోసం.. తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం కనపడ్డ గడ్డల్లా కరుస్తున్నారు. గతంలో పల్లెల్లో పెద్దవాళ్లు మాత్రమే మద్యం సేవించేవాళ్లు.. అది కూడా కల్లు తాగి కడుపు నింపుకునే వాళ్లు.. ఏ కొద్ది మందో సారా తాగే వారు.. కానీ కాలక్రమంలో సారాను కల్లును తాగడం అలవాటు చేసుకున్నారు. గ్రామల్లో బీరు, బ్రాందీ, విస్కీ అంటే.. చాలా అరుదు.. ప్రాణమసుంటి చుట్టం వస్తే తప్ప.. నాటు కోడి కోసి విస్కీ సీసా తీసుకొని రారు.. విస్కీ గానీ బీరు గానీ తెచ్చారంటే.. చాలా గొప్పగా మర్యాద చేసినట్టు లెఖ్ఖ కానీ. ఇప్పుడు అది చాలా సింపుల్.. రోడ్డు మీద ఫ్రెండ్ కనిపిస్తే చాలు.. మాటలు కలిపి మద్యం షాపు వైపు నడుస్తున్నారు. ఊళ్లల్లో సాయంత్రమైతే. పన్నెండు సంవత్సరాలు దాటిని ప్రతి పిల్లవాడూ తాగుడు నేర్చాడు. సాయంత్రమైతే భవిష్యత్తు గురించి ఆలోచించకుడా తాగి ఊగుతున్నారు.. ఈజీ మనీ కోసం పన్నాగాలు పన్ని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.. ఇవి ఎంత విజయవంతంగా జరిగితే ప్రభుత్వానికి అంత ఉపయోగం.. అందుకే మద్యం షాపుల ముందు 20సంవత్సరాల లోపు వారికి మద్యం అమ్మబడదు అన్న బోర్డైతే ఉంటుంది కానీ.. అక్కడ తాగే వారంతా 20 నిండని వారే.. భవిష్యత్తులోె పనికి రాని వారిగా మారడానికి మద్యం షాపులే పాఠశాలలుగా మారుతున్నాయి... కల్లును కాట్లో కలిపిన్రు.. ఎప్పుడైతే గ్రామాల్లో కమ్మని కల్లు కనుమరుగయి పోయిందో.. యువత మొత్తం... స్పిరిట్ మద్యానికి బానిసయిందో.. అప్పట్నుంచి రాష్ట్రానికి జాడ్యం పట్టుకుంది.. ఇప్పుడు మద్యం ద్వారా వస్తున్న ఆదాయం.. ఒకప్పుడు గ్రామాల్లో సగం ఆదాయం గౌడ్ల కుటుంబాలకు వచ్చి వారికి ఉపాధి దొరికేది.. కానీ గౌండ్ల కులస్థులు వారి కుల వృత్తి వంశపారంపర్యంగా వచ్చినదాన్ని 90 శాతం మంది వదిలేశారు. మరోవైపు ప్రభుత్వం.. రోడ్డు వెంట ఉన్న చెట్లను, కరెంట్ పోల్స్, హైపవర్ లైన్స్ సమీపంలో చెట్లను ఇలా రకరకాల కారణాలతో గ్రామాల్లో తాటి చెట్లు, ఈత చెట్లు కనిపించకుండా కుట్ర పన్నుతోంది.. దీంతో ఇటు వృత్తి వదిలిన గౌండ్లకు తోడు తాడిచెట్లు కూడా మాయమవడంతో.. కల్లు కనుమరుగయింది.. బీరుకంటే భీకరంగా పొంగే కల్లు కాంట్రాక్లర్ల చేతిలో పడి విలవిల్లాడుతోంది.. కల్లు కాంపౌండులల్లో తయారయ్యే మందు కల్లు చూసి కల్లంటేనే మామూలు జనం వణుకుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో అయినా జనం మారాలి.. ఈ జవాబుదారీ తనం లేని ప్రభుత్వాన్ని నిలదీయాలి.. అవసరమైతే పునాదులు కదిలేలా చేయాలని మేథావులు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు.. కానీ మద్యం మత్తులో ఉన్న బాబులు ఈ మాట వింటారా.. గాంధీ జయంతి రోజు కూడా బారు షాపులు బార్లా తెరిచే ఈ రాష్ట్రంలో.. బాపూజీ బ్రాంధీ షాపు, గాంధీ వైన్స్ అని కనిపిస్తున్న మన రాష్ట్రంలో.. గాంధీ రాజ్యమెక్కడిది అంతా బ్రాందీ రాజ్యమే..

No comments:

Post a Comment