ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, May 12, 2012

పార్లమెంట్‌కు అరవై ఏళ్లు.. సాధించింది సన్యాసం


అది 1952 మే13... భారత దేశంలో ఓ కొత్త శకం ఆరంభం.. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న నేతలు ఇక్కడే కొలువు తీరారు... ప్రజలు ఏ విశ్వాసంతో తమను ఇక్కడకు పంపారో... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనే వేదిక ఇది. ఇప్పటిలా అప్పుడు ప్రత్యక్ష ప్రసారాలుగానీ.. బ్రేకింగ్ న్యూస్ కానీ లేవు. పార్లమెంట్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాత్రి రేడియోలో వచ్చే వార్తల్లోనే.. అదీ సంపన్న వర్గాలకే సాధ్యం. అయినా మన నేతలు ప్రజలకేం కావాలో అవి చర్చించి మరీ సాధించుకునే వారు.. మైకులు విరిచేయడాలు.. వెల్‌లోకి దూసుకెళ్లడాలు... ప్లకార్డులు పట్టుకొని గోల చేయడాలు లేవు. ఏదైనా నిరసన తెలియజేయాల్సి వస్తే శాంతియుతంగా తెలపడం.. వాకౌట్ చేయడం.. అది కూడా చాలా అరుదగా జరిగే చర్య.. తొలినాళ్లలో పార్లమెంటు చాలా హుందాగా, పద్ధతిగా నడిచేది. పండిట్ నెహ్రూ, శాస్త్రీజి, ఆచార్య కృపలానీ, లాంటి నేతల సారధ్యంలో వాడి, వేడి చర్చలు సాగేవి. సభ అంటే ఎంతో గౌరవం వుండేది. నేతల ప్రసంగాలను అత్యంత శ్రద్ధగా వినేవారు. వాదనలన్నీ అంశాలపైనా, సమస్యలపైనా వుండేవి. అనవసర రచ్చలతో కాలయాపన ఉండేది కాదు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బాగా అమలయ్యేది. సభ్యులు తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తమ ప్రసంగాల్లో మాత్రమే చూపేవారు. తమ వ్యతిరేకతను, నిరసనలను హుందాగా ప్రకటించేవారు. కాల చక్రం గిర్రున తిరుగుతోంది.. ఆరు దశాబ్దాలు అవలీలగా గడిచిపోయాయి. పార్లమెంట్ అంటే ఫైటింగ్ స్టేజీగా మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రజా సమస్యలే.. కాకుండే ప్రజల సొమ్ము ఎవరెంత కాజేశారు.. ప్రజాధనాన్ని ఏ ప్రభుత్వ హయాంలో ఎంత బొక్కేశారు.. గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి.. ఇవే చర్చలు.. ప్రజలకు పనికొచ్చే చట్టాలకు జీరో అవరే గతి... ఎవరు పెద్దగా గళమెత్తి.. వీరోచితంగా ప్రవర్తిస్తే వారే పార్లమెంట్ హీరో.. ఎన్ని మైకులు విరగ్గొట్టి.. ఎన్ని సార్లు వెల్‌లోకి దూసుకెళితే ఆయనే ప్రజల పక్షాన అలుపెరగకుండా పోరాడుతున్నట్టు.. ప్రజా సమస్యల పై వీరు గొంతు చించుకుంటుంటే.. దాన్ని ప్రసార మాద్యమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి గనుక... విపక్షాల పై దుమ్ము పోయడమే పనిగా పెట్టుకొని... దానికి పార్లమెంట్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ప్రతి పక్షం, అధికార పక్షం బహిరంగ సమావేశాల్లో విమర్శలు చేసుకుంటాయి. కానీ ఎదురెదురుగా తిట్టుకునే వేదికగా పార్లమెంట్ మారింది. ఎన్నికల్లో పంచిన నోట్ల కట్టలను ప్రదర్శించే వేదిక కూడా పార్లమెంటే అయింది. ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు వేదికైన మన పార్లమెంటుకు షష్టి పూర్తి వేడుకలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు.. ఎన్ని సవరణలు.. ఎన్ని మలుపులు.. ఈ అరవైఏళ్ల పార్లమెంట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు.. పార్లమెంట్ అంటే మైకుల విరిచేసుకోవడం అనే కోణంలోనే చూడరాదు.. అది భారత పౌరుడి సగటు గళం స్పందనకు వేదిక.. ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు వారి సమస్యలను చర్చించి వారికో పరిష్కారాన్ని సాధించే వేదిక. ప్రభుత్వ పరమైన నిర్ణయాలు చట్టాలుగా మారే కేంద్రం. ఈ వేదిక ఎంతో ఉన్నతమైనది.. సామాన్యుడి గళం వినిపించే ఓ ప్లాట్ ఫామ్..అక్కడ చర్చలుంటాయి.. వాదోపవాదాలూ వుంటాయి.. ప్రజాసమస్యలపై అనేక కోణాల్లో చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ పెద్దలకు సలహాలు, సూచనలు అందుతాయి. పార్లమెంట్ ఉభయ సభలూ రెండు కళ్ల లాంటివి.. కీలకమైన అంశాలపై చర్చలు జరిపి ఉభయ సభలు ఆమోదించాకే బిల్లు చట్ట రూపం తీసుకుంటుంది. పార్లమెంటు కొలువు దీరిన తొలినాళ్లలో చట్ట సభలను పవిత్ర దేవాలయంగా, సభాపతిని పూజారిగా భావించే వారని వృద్ధతరం నేతలంటున్నారు. పార్లమెంటు మొదలైన నాటి నుంచి నేటి వరకూ అందులో కొనసాగుతున్న వారిలో కొందరు ఇంకా వున్నారు. మణిపూర్ కు చెందిన రిషాంగ్ కీషింగ్ 1952లో ఆరంభంలో సభ్యుడిగా వున్నారు. ఇప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక రేషమ్ లాల్ జంగ్డే అనే దళిత న్యాయవాది కూడా మొదటి లోక్ సభ సభ్యుడిగా వున్నారు. బిలాస్ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తొలి పార్లమెంటు సభ్యునిగా వున్న వారిలో మన తెలుగు వారు కూడా వున్నారు. పార్లమెంట్ షష్ఠి పూర్తి చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని... పార్లమెంటులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.. ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులు కొలువుదీరి.. మామూలు సమస్యలపై కాకుండా.. గత అరవయ్యేళ్లలో పార్లమెంటు ప్రస్థానం గురించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గు రించి చర్చలు జరుగుతాయి. సాయంత్రం నాలుగున్నర దాకా ఈ ప్రత్యేక సెషన్ నడుస్తుంది. పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులనూ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రసంగిస్తారు. ప్రధాని మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. పార్లమెంటు షష్టిపూర్తిని పురస్కరించుకుని రూ.5, 10 నాణేలను, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఈ వేడుకల్లో అనాటి సభలో సభ్యులైన రిషాంగ్ కెయిషింగ్, రేషమ్‌లాల్ జంగ్డేలకు గౌరవ సత్కారం చేస్తారు.. ఈ సందర్భంగా వారిరువురూ అలనాటి సభ విశేషాల గురించి తన అనుభవాలనూ... జ్ఞాపకాలను వివరిస్తారు. రిషాంగ్.. 1952 సభలో సభ్యుడిగా ఉండి, ప్రస్తుతం మణిపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మ ణిపూర్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఘనత కూడా రి షాంగ్‌ సొంతం. రేషమ్‌లాల్ జంగ్డే ఒక దళిత న్యాయవాది. తొలిసభలో సభ్యుడైన ఆయన.. బిలాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యా రు. పార్లమెంట్ అరవై సంవత్సరాల వేడుకలో పంచుకున్న అనుభవాలతోనైనా.. పార్లమెంట్‌లో హుందాతనం.. సభ్యులు ప్రవర్తించిన తీరు.. ప్రజా సమస్యల పై చిత్ర శుద్ధి లాంటి అంశాలు మన నేతలు గుర్తు చేసుకొంటే.. ఈ వేడుకలకు నిజమైన అర్ధం...

No comments:

Post a Comment