Wednesday, October 12, 2011
తెలంగాణ రహస్యం ఇదా...?
అరణ్యంలో తిరిగే ఆరుద్ర పురుగులన్నీ ఒక్కటై రేపటి పొద్దు పొడుపుకు పురుడు పోస్తనంటున్నయి. చిమ్మ చీకటిలో ఎగిరే మిణుగురులన్నీ కొమ్మ కొమ్మన చేరి చీకటిని తరమేస్తమంటున్నయి. ఇక్కడి నేలకు పోరాటాల పురిటి వాసన పోలేదు. ఇక్కడి మట్టి కణాలతో ఏ వీరుడి రక్తకణాలో పెనవేసుకొని నిత్యం కణకణ మండుతుంటయి. లోకం కోసం తనలో తాను రగిలే సూర్యుడిలా మండే ధీరుల శ్వాసలు పిల్లగాలులై ప్రసరిస్తాయిక్కడ. ఈ నేలను ఓపికతో తవ్వుకుంటూ పోతే ఊరికో దదీచి ఎముక దొరుకుతుంది. పొద్దు పొడుపును పొత్తి కడుపులో దాచుకుని పురిటి నొప్పులు పడుతున్న తల్లులు గంభీరంగా ఊపిరి బిగబడతారిక్కడ.. ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లు నిండుతుంటే... కొత్త చేతులు మొలుస్తాయిక్కడ.. గన్నేరు.. మందారం.. మోదుగుపూలు ఒక్కటై వీరమాలల్లుతాయి... ఎన్ని తరాలు అంతరించినా త్యాగంలోనే తరించే జాతి మాది.. ఇది తెలంగాణ.. రుద్రావేశంతో పెఠీల్మని ఎద తంత్రులు తెంచుకున్న కోటి రతనాల వీణ..
Tuesday, October 11, 2011
సకలం బందులో పాఠశాలలు ?
సకల జనుల సమ్మె వల్ల విద్యార్ధులు నష్టపోతున్నారని... విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో తెలంగాణ వాదుల మాత్రం తెలంగాణ వస్తుందనుకుంటే విద్యాసంవత్సరం కోల్పోవడానికి కూడా సిద్ధమేనంటున్నారు... లక్షలాధిరూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలకు డొనేషన్ల రూపంలో చెల్లించేవారు విద్యా సంస్థల యాజమాన్యాన్ని , ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తున్నారు. సకల జనుల సమ్మె... తెలంగాణ మొత్తం స్థంభిచి పోవాలనే లక్ష్యంతో.. సకల జనుల సమ్మెను తలపెట్టారు.. కానీ ప్రభుత్వ సంస్థలు తప్ప ప్రైవేట్ సంస్థలేవీ ఈ సమ్మెలో పాల్గొనడం లేదని.. అన్ని రకాల కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతుంటే విద్యార్ధులను ఈ సమ్మెలోకి లాగడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఇటు తెలంగాణ వాదులకు అటు విద్యార్ధుల తల్లి దండ్రులకు మద్య తీవ్ర వాగ్వాదానికి దారి తీస్తోంది.
అవును.. గత రెండు రోజుల క్రితం కూకట్ పల్లిలో యన్ ఆర్ ఐ విద్యాసంస్థ ముందు.. పాఠశాల తెరవాలని.. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని విద్యార్ధుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు అక్కడికి రావడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. కావాలంటే ఉద్యమాల్లోకి మేమొస్తాం.. మా పిల్లల్ని ఉద్యమాల్లోకి లాగకండని పేరెంట్స్ మీడియా సాక్షిగా వేడుకున్నారు. ఇదంతా చూస్తూ నిలబడ్డ స్కూల్ య ాజమాన్యం మాత్రం రెండు రోజుల గడువు కోరింది.
కూకట్ పల్లి అంటే సహజంగా ఆంధ్రా సెటిలర్స్ ఉండే ప్రాంతం కనుక వారిలా మాట్లాడారని తెలంగాణ వాదుల విమర్శ. తెలంగాణలో ఎక్కడా లేనిది కూకట్ పల్లిలోనే ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికమో.. లేక అక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉండి పిల్లల విద్య పట్ల అధికంగా శ్రద్ధ చూపడమో ఒక కారణం కావచ్చు.. కానీ అదే సమయంలో మందకృష్ణ మాదిగ కూడా అటువంటి వ్యాఖ్యలే చేశాడు. పిల్లల చదువుల జోలికి పోకూడదని.. సమ్మె వల్ల విద్యార్ధులు విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలేవైనా పాఠశాల బంద్ చేస్తే విద్యార్ధులు ఇంటి వద్ద ఉండి టీవీ రిమోట్ తో ఆడుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదని విద్యార్ధుల తల్లిదండ్రుల అభిప్రాయం. మిగతా వ్యాపారాలన్నీ జోరుగా సాగుతుంటే విద్యాసంస్థల బంద్ దేనికని వారి ప్రశ్న. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బార్ షాపులు యధేచ్చగా వ్యాపారం చేసుకుంటుంటే అడ్డుకోని వారు విద్యాసంస్థలను తెలంగాణ వచ్చేవరకు తెరవొద్దంటూ అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. లక్షల రూపాయల డొనేషన్లు కట్టి చదివించే తాము బందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మంగళవారం సోమాజీగూడా ప్రెస్ క్లబ్లో విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు విశాలాంధ్ర మహాసభ సభ్చుడు నలమోతు చక్రవర్తి పరుషంగా మాట్లాడటంతో సమావేశం గందరగోళానికి దారితీసింది.
తెలంగాణ సాధన కోసం తాము ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వాదులు ఊరూరా... వాడ వాడనా చాటుతున్నారు. విద్యార్ధులే స్వచ్ఛందంగా రోడ్డెక్కి జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో దసరా సెలవులు మగిసీ ముగియడంతోనే పాఠశాలలు తెరవాలంటూ విశాలాంధ్ర మహాసభ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపడంతో ... తెలంగాణ వాదుల కోపం తారా స్థాయికి చేరింది. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు, న్యాయవాదులు ప్రెస్ క్లబ్ వైపు దూసుకు రావడంతో పోలీసులు వారిని గేటు వద్దనే అడ్డుకున్నారు. పలుమార్లు తెలంగాణ వాదులు లోపలికి దూసుకురావాలని ప్రయత్నించడంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. అదే సమయంలో తమ పై దురుసుగా వ్యవహరించిన నలమోతు చక్రవర్తి, ఆయన కారు డ్రైవర్ పై చర్యతీసుకోవాలంటూ రిపోర్టర్లు నిర్వాహకుల్ని అడ్డగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో విలేకరులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది.
రాజకీయ పార్టీలు విద్యార్ధులను ఉద్యమాల కోసం వాడుకోవడం తగదని రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అభిప్రాయ పడ్డారు. రాజకీయ పార్టీలు, ఉద్యమ నాయకులు విద్యార్ధులతో సంబంధం లేకుండానే ఉద్యమాన్ని కొనసాగించ వచ్చన్నారు. విద్యార్ధులను చదువులకు దూరంగా ఉంచడం ద్వారా లక్ష్యం నెరవేరదన్నారు.
తెలంగాణ వచ్చే వరకు సంస్థలన్నిటినీ నిలిపి వేస్తామని ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించాయి. ప్రభుత్వ ఉపాద్యాయులు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో పాఠశాలలు మూసివేయక తప్పని పరిస్థితి. అలాగని ప్రైవేటు పాఠశాలలకు అనుమతి నిస్తే రేపు ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు వెనకబడితే నష్టం ప్రభుత్వోపాధ్యాయులకు, వారిని నమ్ముకున్న విద్యార్ధులకు అందుకే అనివార్యంగా ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ విద్యాసంస్థలు బందులో పాల్గొనాల్సివస్తోంది. పరిస్థితి ఒక కొలిక్కి వస్తుందనుకున్న సందర్భంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మేథావులంటున్నారు.
అవును.. గత రెండు రోజుల క్రితం కూకట్ పల్లిలో యన్ ఆర్ ఐ విద్యాసంస్థ ముందు.. పాఠశాల తెరవాలని.. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని విద్యార్ధుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు అక్కడికి రావడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. కావాలంటే ఉద్యమాల్లోకి మేమొస్తాం.. మా పిల్లల్ని ఉద్యమాల్లోకి లాగకండని పేరెంట్స్ మీడియా సాక్షిగా వేడుకున్నారు. ఇదంతా చూస్తూ నిలబడ్డ స్కూల్ య ాజమాన్యం మాత్రం రెండు రోజుల గడువు కోరింది.
కూకట్ పల్లి అంటే సహజంగా ఆంధ్రా సెటిలర్స్ ఉండే ప్రాంతం కనుక వారిలా మాట్లాడారని తెలంగాణ వాదుల విమర్శ. తెలంగాణలో ఎక్కడా లేనిది కూకట్ పల్లిలోనే ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికమో.. లేక అక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉండి పిల్లల విద్య పట్ల అధికంగా శ్రద్ధ చూపడమో ఒక కారణం కావచ్చు.. కానీ అదే సమయంలో మందకృష్ణ మాదిగ కూడా అటువంటి వ్యాఖ్యలే చేశాడు. పిల్లల చదువుల జోలికి పోకూడదని.. సమ్మె వల్ల విద్యార్ధులు విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలేవైనా పాఠశాల బంద్ చేస్తే విద్యార్ధులు ఇంటి వద్ద ఉండి టీవీ రిమోట్ తో ఆడుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదని విద్యార్ధుల తల్లిదండ్రుల అభిప్రాయం. మిగతా వ్యాపారాలన్నీ జోరుగా సాగుతుంటే విద్యాసంస్థల బంద్ దేనికని వారి ప్రశ్న. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బార్ షాపులు యధేచ్చగా వ్యాపారం చేసుకుంటుంటే అడ్డుకోని వారు విద్యాసంస్థలను తెలంగాణ వచ్చేవరకు తెరవొద్దంటూ అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. లక్షల రూపాయల డొనేషన్లు కట్టి చదివించే తాము బందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మంగళవారం సోమాజీగూడా ప్రెస్ క్లబ్లో విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు విశాలాంధ్ర మహాసభ సభ్చుడు నలమోతు చక్రవర్తి పరుషంగా మాట్లాడటంతో సమావేశం గందరగోళానికి దారితీసింది.
తెలంగాణ సాధన కోసం తాము ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వాదులు ఊరూరా... వాడ వాడనా చాటుతున్నారు. విద్యార్ధులే స్వచ్ఛందంగా రోడ్డెక్కి జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో దసరా సెలవులు మగిసీ ముగియడంతోనే పాఠశాలలు తెరవాలంటూ విశాలాంధ్ర మహాసభ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపడంతో ... తెలంగాణ వాదుల కోపం తారా స్థాయికి చేరింది. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు, న్యాయవాదులు ప్రెస్ క్లబ్ వైపు దూసుకు రావడంతో పోలీసులు వారిని గేటు వద్దనే అడ్డుకున్నారు. పలుమార్లు తెలంగాణ వాదులు లోపలికి దూసుకురావాలని ప్రయత్నించడంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. అదే సమయంలో తమ పై దురుసుగా వ్యవహరించిన నలమోతు చక్రవర్తి, ఆయన కారు డ్రైవర్ పై చర్యతీసుకోవాలంటూ రిపోర్టర్లు నిర్వాహకుల్ని అడ్డగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో విలేకరులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది.
రాజకీయ పార్టీలు విద్యార్ధులను ఉద్యమాల కోసం వాడుకోవడం తగదని రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అభిప్రాయ పడ్డారు. రాజకీయ పార్టీలు, ఉద్యమ నాయకులు విద్యార్ధులతో సంబంధం లేకుండానే ఉద్యమాన్ని కొనసాగించ వచ్చన్నారు. విద్యార్ధులను చదువులకు దూరంగా ఉంచడం ద్వారా లక్ష్యం నెరవేరదన్నారు.
తెలంగాణ వచ్చే వరకు సంస్థలన్నిటినీ నిలిపి వేస్తామని ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించాయి. ప్రభుత్వ ఉపాద్యాయులు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో పాఠశాలలు మూసివేయక తప్పని పరిస్థితి. అలాగని ప్రైవేటు పాఠశాలలకు అనుమతి నిస్తే రేపు ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు వెనకబడితే నష్టం ప్రభుత్వోపాధ్యాయులకు, వారిని నమ్ముకున్న విద్యార్ధులకు అందుకే అనివార్యంగా ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ విద్యాసంస్థలు బందులో పాల్గొనాల్సివస్తోంది. పరిస్థితి ఒక కొలిక్కి వస్తుందనుకున్న సందర్భంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మేథావులంటున్నారు.
మారన్ కథ జైలుకేనా...?

2జి స్పెక్ట్రమ్ కేసులో దయానిధి మారన్ పై సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇటు కళానిధి మారన్ ఇంట్లో కూడా సిబిఐ సోదాలు నిర్వహించింది. ఎయిర్ సెల్, మ్యాక్సిన్ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలకు సంబంధించి మారన్ సోదరుల పై ఈ సోదాలునిర్వహించారు. మరోవైపు హైదారబాద్ లో అపోలో గ్రూప్ డైరెక్టర్ సునితా రెడ్డి కార్యాలయంలో కూడా సిబిఐ సోదాలు నిర్వహించింది. దీంతో 2జి కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇంతకీ 2జి కుంభకోణం అంటే ఏంటి.. 2జి స్పెక్ట్రం కేసులో ఎవరెవరి పై ఆరోపణలొచ్చాయి. అసలేంటీ 2జి కథ.. ఒకసారి అవలోకిద్దాం..
దేశరాజకీయాలను ఓ కుదుపు కుదిపిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం డొంక కదులుతూనే ఉంది. ఈ కుంభకోణానికి సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులంతా ఒక్కొక్కరే చెరసాల చెంతకు చేరుకుంటున్నారు. ఇప్పటికే రాజా, కనిమొళిలు జైలు భోగాలు అనుభవిస్తుంటే ఆ జాబితాలోకి మారన్ సోదరులు కూడా చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి. మారన్ సోదరులను ఇప్పటి వరకు అరెస్టు చేయనప్పటికీ ఇరువురు సోదరుల పై సిబిఐ కేసులు నమోదు చేసింది.
రాజా, కనిమొళితోనే ఈ కథ కంచికి చేరిందనుకున్నారంతా.. ఆ మధ్య మారన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ వెంటనే ఆ వార్తలను సిబిఐ ఖండించడం వెనుక అంతరార్ధం ిఇప్పుడు భోదపడుతోంది. దయానిధి మారన్ కమ్యునికేషన్ల శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ సెల్, మాక్సిన్ సంస్థల లైసెన్స్ వ్యవహారంలో పక్షపాతంగా వ్యవహరించారనే అపవాదు మూట గట్టుకున్నారు. టెలికామ్ అధికారుల నుంచి ఏకగ్రీవ సిఫారసులు ఉన్నప్పటికీ, మారన్ ఎయిర్సెల్ ఫైల్ను తొక్కిపెట్టినట్లు సీబీఐ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఎయిర్సెట్ పట్ల ఒత్తిడి తెచ్చే వైఖరిని మారన్ అనుసరించినట్లు కూడా నివేదికలో పేర్కొంది. కంపెనీలో కొంత వాటాను మాక్సిస్ సంస్థకు విక్రయిం చాల్సిందిగా ఎయిర్సెల్ చీఫ్పై మారన్ ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా తమ విచారణలో తేలినట్టు సీబీఐ తన నివేదికలో తెలిపింది. దయానిధి మారన్ వ్యూహాల వల్లనే ఆయన సోదరుడు కళానిధికి చెందిన సన్ టీవీ రూ.750 కోట్ల మేరకు లబ్ధి పొందినట్లు సీబీఐ వర్గాలు గతంలోనే వెల్లడించాయి. ఎయిర్సెల్లో తన వాటాను కళానిధికి విక్రయించాల్సిందిగా దయానిధి తనపై ఒత్తిడి తీసుకువచ్చి నట్లు ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు శివశంకరన్ గతంలోనే ఆరోపించారు.
ఈ కుంభకోణంలో చిదంబరం పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వచ్చిన నేపద్యంలో 2జి కేసు పై మరింత ఆసక్తి నెలకొంది. వివిధ కారణాల వల్ల కాస్త జాప్యం జరిగినా తిరిగి తెర పైకి వచ్చింది. తాజాగా మారన్ సోదరుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మారన్ సోదరుల పై అరెస్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ అపోలో డైరెక్టర్ సునితా రెడ్డి కార్యాలయాల పై సిబిఐ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఉచ్చు ఇంకా ఎందరు ప్రముఖుల మెడుకు చుట్టుకోనుందోనన్న ఆసక్తి నెలకొంది.
Saturday, October 8, 2011
Saturday, October 1, 2011
బతుకమ్మ పేదోళ్లదా...? పెద్దోళ్లదా..? నిజాలేంటి..?

బతుకమ్మ పండుగకు మూలాలెక్కడ.. బతుకమ్మకు జీవం పోసిందెవరు... ఇప్పుడైతే అన్ని వర్గాల ప్రజలు బతుకమ్మను ఆడుతున్నారు. గతంలో కూడా బతుకమ్మ అందరి బతుకమ్మేనా.. బతుకమ్మకు పూలకు సంబంధం ఏమిటి.. బతుకమ్మ కథల్లో నిజమెంత.. స్పెషల్ స్టోరీ..
బతుకమ్మ.. వెల్లివిరిసిన పూల సంబరం. నడిచొచ్చిచ్చే పూవనం.. మంచు తడికి మురిసిపోయే పూల కొమ్మలు పడుచుల కొనగోటిని తాకే తరుణం.. తడిగాలుల్లో తేనె పరిమళం పరుచుకునే పూలరుతువు.. మత్తడి దునికే నీళ్లతో చిత్తడిగా మారిన నేల పొత్తిళ్లను పొదివి పట్టుకునే పూరెమ్మల గారాబం.. వర్షరుతువుకు.. శీతాకాలానికి నడుమ ఆహ్లాదబరిత పరిమళాలు వెదజల్లే సుమస్మమ్మోహనం.. ఈ రుతువులోనే ఎన్నో ప్రకృతి కార్యాలకు పునాదులు పడతాయి. ఈ రుతువే ఎన్నో వాతావరణ మార్పులకు బీజం వేస్తుంది.. ఈ వాతావరణమే ఎన్నో ఉత్పరివర్తనాలకు పునాది వేస్తుంది.. చంటిపిల్లను చంకనెత్తుకున్న చందంగా పూలుగుత్తులను ఎత్తుకున్న తంగేడు మొక్కలు.. అడవి పడుచు శిగలో తురుముకున్న కొండ మల్లెల్లా... కొండకోనల్లో వయ్యారంగా నడుస్తున్న కోయ పడుచుల్లా... గాలికి ఊగుతున్న గునుగు పూలు.. ఎంత వర్ణించాలన్నా ఈ రుతువులో కనిపించే ప్రకృతి అందం మాటలకు చాలదు. ఈ సుమతాడన స్పర్శతో మగువ మునివేళ్లు కొత్త అనుభూతితో పొంగిపోతాయి.
మనుషులకు కులాలు మతాలు, కట్టుబాట్లు ఉంటాయి.. నింగి, నేల, ఆకాశం అగ్ని, వాయువు పంచభూతాలకు ఏ కట్టుబాట్లు తారతమ్యాలు లేవు. అలా అని చాటి చెప్పేందుకే బతుకమ్మ పండుగలో పదం పదం.. పాదం పాదం కలిపి ఆటపాటల్లో పాల్గొంటారు. అయితే ఈ పండుగను తెలంగాణ జాతి మొత్తం జాతీయ పండుగలా జరుపుకుంటున్నా.. ఒకప్పుడు ఇది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమనే వాదనలు కూడా ఉన్నాయి. . బతుకమ్మ పుట్టుకకు కారణమైన పురాణగాథలు చాలానే ఉన్నా.. అసలు కారణం మాత్రం ఒక్కటేనని పరిశోధకులు అభిప్రాయం.. విజ్ఞానం అంతగా అభివృద్ది చెందని రోజుల్లో ప్రసూతి మరణాలు అధికంగా జరిగేవి.. వివిధ రకాల కారణాల వల్ల పిల్లలు పురుటిలోనే చనిపోయేవారు.. పుట్టిన పిల్లలు వరసగా చనిపోతుంటే.. తర్వాత పుట్టిన సంతానం తమది కాదన్నట్టు.. పెంటకుప్ప పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.. అలా పెంటకుప్ప పై శిశువును వదిలితే ఆ తమది కాదని దుష్టశక్తులు వదిలేస్తాయని పూర్వికుల నమ్మకం. పెంటకుప్ప పై చాటలో పెట్టిన శిశువులు కొందరు కాకతాళీయంగా బతికారు.. అటువంటి వాళ్లకు పెంటయ్య, పెంటమ్మ అనే పేర్లు కూడా పెట్టారు. కాస్త సంపన్న వర్గమైతే మరీ పెట్టకుప్పమీద పెట్టకుండా కాసిన్ని పూలు, ఆకులు ఒక్కచోట చేర్చి దాన్నే చెత్త కుప్పగా భావించి శిశువును పూలదిబ్బ పై పడుకోబెట్టేవారు. పూలదిబ్బ పై పడుకోబెట్టిన శిశువు అదృష్టవశాత్తూ బతికినందువల్ల.. ఆ పూల దిబ్బనే బతుకమ్మ అన్నారు.. అంతేకాదు. పూలదిబ్బ పై పడుకోబెట్టిన శిశువు ఏడుస్తుంటే మహిళలంతా చుట్టూ చేరి ఊయల పాటలు పాడేవారు.. తమ శిశువును కాపాడినందు వల్ల ఆ పూలదిబ్బకు మహిహలున్నాయని.. ఆ పూలకుప్పే తమ ఇలవేల్పని భావించి గౌరమ్మను చేర్చి పూజించడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది..
ఇంతకీ బతుకమ్మ పేదల పండుగా.. పెద్దోళ్ల పండుగా.. అనే వాదన ఎదురయినపుడు దీన్ని పేదల పండుగ అనే ఎక్కువ మంది వాదిస్తారు. ఎందుకంటే ఈ పండుగ పుట్టుకలోనే పేదతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బతుకమ్మ కోసం బొడ్డెమ్మను పుట్టమన్నుతో చేస్తారు. బతుకమ్మను అడవిపూలతో పేరుస్తారు.. కాబట్టి ఏ ఖర్చూ ఉండదు.. అంతేకాకుండా.. గౌరమ్మను పూజిచేందుకు ఏ మంత్ర తంత్రాలూ వాడరు.. కేవలం పాటలతోనే ఆదిశక్తిని స్తుతిస్తారు. ముగ్గులు, పూలు, పాటలే ఈ బతుకమ్మ ఖర్చులు.. బతుకమ్మకు పెట్టే ప్రసాదం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకొన్నది.. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇంట్లో ఉన్న నానబెట్టిన బియ్యం, పాలు, అటుకులు, బెల్లం ఇవే ప్రసాదాలు.. సంపన్న వర్గం చేసుకునే వేడుకలకు చక్కర పొంగలి, నూనెతో చేసే పిండి వంటలు, దేవుడి కళ్యాణం, ఆ కళ్యాణానికి మంత్రాలు, వంటి రకరకాల తంతులుంటాయి.. బతుకమ్మ వేడుకల్లో ఇవేవీ ఉండవు. అందుకే బతుకమ్మ పేదల పండుగ అని చాలా మంది వాదిస్తారు.
బతుకమ్మ పండుగకున్న విశిష్టత మరోటి ఉంది.. వర్షరుతువులో కురిసిన వానలన్నీ చెరువుల్లో చేరుతాయి. ఆ నీటిలో రకరకాల మలినాలు చేరి కలుషితంగా తయారవుతాయి. ఈ కలుషిత నీటిని తంగేడు పూలు శుద్ధి చేస్తాయి. తరువాత కలరా వంటి వ్యాధులు వ్యాపించకుండా గునుగు పూలు అరికడతాయి. పూర్వకాలంలో సంపన్న వర్గాలకు ఇళ్లలో బావులుండేవి.. వాటిలో పంచాయితీ బ్లీచింగ్ పౌడర్ వేసేవారు. కానీ పేద ప్రజలకు బావుల్లో నీటికి ప్రవేశం లేదు. అందుకే వారు మంచినీటికోెసం కుంటలు, చెరువులను ఆశ్రయించాల్సి వచ్చింది. తాము మంచినీటి కోసం వాడే చెరువులు కాబట్టి వారే వాటిని శుద్ధి చేసుకునేవారు. వాడవాడంతా కలిసి తంగేడు గునుగు పూలతో బాటు గౌరమ్మగా పేర్చిన పసుపును కుంటలు చెరువుల్లో కలపడం ద్వారా నీరు శుద్ది అవుతుంది..
కాలక్రమంలో పూలకుప్పగా పూజలందుకున్న బతుకమ్మ కాస్త అనేక రూపాలు మార్చుకొని ఇప్పుడు తెలంగాణ జాతి యావత్తూ జరుపుకునే సంబరంగా మారింది. పుక్కిటి పురాణాలను పక్కన బెట్టి బతుకమ్మ పండుగలో ఉన్న ఔచిత్యాన్ని చూడాలి.. పదిమందిని ఒక్కటి చేసే పూలజాతరను ప్రోత్సహించాలి.. ఆడపడుచులకు అనధికార కౌన్సిలింగ్ కేంద్రాలుగా మారిన బతుకమ్మలను పేర్చే ఇళ్లు సంసారాలను చక్కబరుస్తున్నాయి.. వాదాలు వివాదాలు మాని బతుకమ్మ సంస్కృతిని దేశం మొత్తం ఆచరించే విధంగా తీర్చిదిద్దాలి..
Tuesday, September 27, 2011
బతుకమ్మ పండుగ విశిష్టత.. లోగుట్టు

బతుకమ్మ పండగ.. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకొనే ముచ్చటైన పండగ. ఇందులో కులాల కట్టుబాట్లు, ధనికులమనే అహంకారాలు లేవు. కట్టుబాట్లన్నీమనుషులకే కాని నీటికి, పూలకూ లేవని చెబుతూ అందరూ సామరస్యంగా కలిసి మెలిసి జరుపుకునే పండగ. తెలంగాణ విశిష్టతను చాటిచెప్పే తీరొక్క పూల జాతర బతుకమ్మ. మట్టి మనుషుల మనసుల నిండా పూల వాసన గుప్పుమని గుభాళించే గొప్ప
బతుకమ్మ పండుగంటే.. తెలంగాణ పడుచులకు ఎక్కడలేని సంబరం.. కొమ్మ కొమ్మ సిగలో పూసిన పూల కొన గోటితో తెంపుకొని.. ఒద్దికగా ఒడినింపుకొని.. భక్తితో ఇంటికి తెచ్చుకుంటారు..ఏ ఇల్లూ చూసినా బతుకమ్మల ముచ్చట్టే.. ఏ బజారు చూసినా బతుకమ్మల జాతరే.. ఈ తొమ్మిది రోజులూ ఊరంతా బతుకమ్మే... ఊరూరా బతుకమ్మే.
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతీ సంప్రదాయాలకు అద్ధం పట్టే పడుగ బతుకమ్మ.. ఈ బతుకమ్మ పండగ ఎంగిలిపువ్వు బతుకమ్మతో ఆరంభమై, విజయదశమికి ఒక రోజు ముందు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల పండగలో తీరొక్క పువ్వులతోబతుకమ్మను ఒద్దికగా పేర్చుకుంటారు. కలాలకు, మతాలకు అతీతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ముచ్చటగా జరుపుకునే పండుగ బతుకమ్మ.. వర్షాలు తగ్గుముఖం పట్టి నేల పై పుట్టిన ప్రతికొమ్మా పూవుకు పురుడు పోసే పూలరుతువిది.. నేలమ్మ సిగలో ప్రకృతి మాత తురిమిన పూలచెండు వెన్నెలై వెలుగులు చిమ్ముతుంది.. ఆ పండు వెన్నెల్లో.. పూల వెలుగుల్లో పడుచు కన్నులు చెంపలను నిండుతాయి. ఏపుగా ఎదిగిన పంటల నడుమ. విరగపూసిన పువ్వులతో సాయంకాలం వరకూ బతుకమ్మలను పేర్చుకుంటారు. బొడ్డెమ్మలను చేసుకుంటారు. గౌరమ్మను పుదిస్తారు. ఫలహారాలు చేసుకుంటారు. అప్పటికే ఇండ్లు, వాకిళ్లు అలికి, పూసి, ముగ్గులు వేసి, శుచిగా తీర్చి దిద్దుకుంటారు. ఉన్న దాంట్లోనే శుభ్రమైన బట్టలు కట్టుకొని బతుకమ్మ ఆటకు బయలు దేరుతారు.
పూల మద్యలో కొలువుదీరిన ఈ గౌరమ్మే బతుకమ్మ అని, ఆమే శ్రీమహాలక్ష్మి అవతారమని తెలంగాణ ప్రజల నమ్మకం.. తంగెడు పువ్వంటే గౌరమ్మకు ఇష్టమనీ, గౌరి పూజకు తప్పక తంగెడు పువ్వును వాడడం వాళ్ల ఆనవాయితీగా వస్తోంది..కొద్దిగా పసుపు తీసుకొని దాన్ని నీళ్లతో తడిపి నాలుగు వేళ్లతో ముద్దగా చేసి నిలబెడతారు. దానికి పసుపు కుంకుమలు అద్ది పసుపు గౌరమ్మ మీద వేస్తారు. ఆ గౌరమ్మను రెండు తమల పాకుల మీద పెడతారు...ఈ గౌరమమ్మే బతుకమ్మ అనీ, బతుకమ్మే గౌరమ్మ అనీ అంతటా విశ్వసిస్తారు. బతుకమ్మను పూజిస్తే.. ఆడవాళ్లకు ఆరోగ్యమనీ, కోరిన కోరికలు ఫలిస్తాయనీ, ఆయుష్షు, సకల సంపదలు పెరిగి ముత్తైవులుగా ఉంటారని జానపదుల నమ్మకం.
బతుకమ్మను పేర్చడం అంటే అంత సులువు కాదు.. పట్టుకుంటే తునిగి పోయే తంగేడు పూలను ఒద్దికగా పేర్చుకుంటూ బతుకమ్మను చేయడం అంటే ఎంతో ఓపిక.. నైపుణ్యం కావాలి.. ఏ మాత్రం తేడా వచ్చినా.. కష్టం పడి పేర్చిన బతుకమ్మ క్షణంలో చెదిరిపోతుంది..
బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళ. తంగెడు పువ్వు, బంతిపువ్వు, గునుగుపువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకన పువ్వు, ఛెత్రి పువ్వు, గులాబి, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరుపూలు, గోరెంకపూలు, , ఇట్లా ఎన్నో రకాల పువ్వులు బతుకమ్మలో కొలువుదీరుతాయి..
బతుకమ్మ ఎత్తుగా పేర్చడానికి...గునుగు పువ్వులను మొదలు కత్తిరించి రకరకాల రంగులల్లో అద్ది చిన్నచిన్న కట్టలుగా కట్టి పేర్చుకుంటారు. తెచ్చిన పువ్వును బట్టి పళ్లెమో,..వెడల్పాటి ఈత పల్లెకను తీసుకొని అందులో వృత్తాకారంగా అంచునుండి గోడకట్టినట్లు పూవుల కట్టలు పేర్చుతూ...బతుకమ్మ నిలవడానికి కడుపులో గుమ్మడి, ఆముదం, కాకర, బీర ఆకులు ఏవి దొరికినా వాటిని విరిచి ముక్కలు చేసి నింపుకుంటా అంగుళం అంగుళం మేర పైకి లేపుతారు.వరుస వరుసకూ పువ్వులు మారుతాయి. పూవుల రంగు మారుతుంది. క్రింద బాగంలో వెడల్పుగా మొదలైన గుండ్రని బతుకమ్మ త్రికోణాకారంలో గోపురంలా పైకి లేస్తుంది. శిఖరానికి ఒక పోకబంతి పువ్వు లేక ధగధగ మెరిసే వంకాయ రంగు పువ్వునో అందంగా అలంకరిస్తారు..
ఈ బతుకమ్మ ఒక్క అడుగు నుండి నాలుగు అడుగుల ఎత్తు వరకూ పేర్చుకొని.. తాము పేర్చిన బతుకమ్మను చూసి మురిసిపోతారు..
బతుకమ్మను పేర్చి మొదట దర్వాజ ఎదురుగా గోడ దగ్గర పీటవేసి వుంచుతారు. అగరొత్తులు ముట్టిస్తారు. ఎదురుగా పళ్లెంలో గౌరమ్మనుంచుతారు. ఆ పసుపు గౌరమ్మే బతుకమ్మ,
అన్ని పండుగలకు పెట్టే ప్రసాదాలు వేరు.. బతుకమ్మకు సమర్పించే ప్రసాదాలు వేరు.. తొమ్మిది రోజులు జరిపే బతుకమ్మ వేడుకల్లో... తొమ్మిది రోజులు.. తొమ్మిది రకాల ప్రసాదాలు బతుకమ్మకు సమర్పిస్తారు.
బతుకమ్మకు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పలహారాలు సమర్పిస్తారు. మొదటి రోజు- ఎంగిలిపువ్వు బతుకమ్మ అమావాస్య నాడు చేస్తారు. ఆ రోజు ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం వుంటుంది. రెండో రోజు- అటుకుల బతుకమ్మ: సప్పడి పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం చేస్తారు. మూడో రోజు మద్దపప్పు బతుకమ్మ..- ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం చేస్తారు..
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ... పాలు, బెల్లం, నానేసిన బియ్యం ప్రసాదంగా సమర్పిస్తారు. ఐదో నాడు - అట్ల బతుకమ్మకు.. బియ్యం నానబెట్టి తీసి దంచి, లేదా విసిరి అట్లు, దోశలు, ఫలహారంగా పెడతారు.ఆరవరోజు. - అలిగిన బతుకమ్మ.. ఈరోజు బతుకమ్మను పేర్చి ఆట ఆడతారు గానీ, ఈ రోజు ప్రసాదం ఏమీ ఉండదు.ఏడవ రోజు - వేపకాయల బతుకమ్మ: సకినాలు చేసే పిండి పదార్థాన్ని చిన్నచిన్న వేపకాయలంత పరిమాణంలో వేపకాయలుగా, ముద్దలుగా చేసి నూనెలో దేవిన వంటకాలను ప్రసాదంగా సమర్పిస్తారు...ఎనిమిదోనాడు - వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారు చేసిన ఫలహారం పెడతారు , చివరి రోజు బతుకమ్మను - సద్దుల బతుకమ్మ అంటారు.. ఐదు రకాల సద్దులు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర , కొబ్బరి తురుము , నువ్వుల పొడి, రకరకాల సద్దులను ప్రసాదంగా
తొమ్మిది రోజులు బతుకమ్మలను చేసి, ఫలహారాలతో ఇంటి ముందు పెట్టుకొని ఉయ్యాల పాటతో ఆడుతారు., గ్రామ బొడ్రాయి దగ్గర కూడా అందరి బతుకమ్మలను ఉంచి, స్త్రీలందరూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొట్టుకుంటూ ఉయ్యాల పాట పాడుకుంటూ ఆడుతారు.డప్పుల దరువు, చప్పుట్ల దరువులు ఉత్సాహంగా ఊరిని కదిలిస్తుంటాయి. ఇక్కడ అన్ని కులాల వారూ చేరి ఐక్యతను, స్నేహాన్ని, గ్రామ బంధుత్వాన్ని కళ్లకు కట్టేలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. బొడ్రాయి దగ్గర చాలా సేపు ఆడిన తర్వాత ఎవరి బతుకమ్మను వాళ్లు రెండు చేతులతో ఎత్తుకొని చెరువు దగ్గరికెళతారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి... ఆడి ఆ తర్వాత నీళ్లలో విడవడం ఆనవాయితీగా వస్తోంది.
పూవులు చెరువులో వేయడంలో ఒక శాస్త్రీయ దృక్పథం ఉందనిపిస్తుంది. బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు ఆయుర్వేదంలో ఔషధ విలువలున్నవే.. పువ్వులు నీట చేరి కాలుష్యాన్ని నివారిస్తాయని శాస్త్రాల్లో చెప్పారు..
బతుకమ్మను విడవడంలో కూడా ఒక పద్ధతి వుంటుంది. మోకాళ్ల వరకు నీళ్లలో దిగాక... నీటిమీద బతుకమ్మ పళ్లెం ఉంచి, ఇంకా కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మనుంచి ఆ పళ్లాన్ని మెల్లగా కిందకి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మను అలలతో ముందుకు నెట్టి వెనక్కి తిరిగి వస్తారు. వస్తూ వస్తూ పళ్లెంలో కొన్ని నీళ్లు తెచ్చి అందరి మీదా చల్లుతారు. నీళ్లు చల్లాక తెచ్చుకున్న ప్రసాదం ఒకరికొకరు పంచుకుంటూ ‘ఇచ్చుకుంటి వాయినం- పుచ్చుకుంటి వాయినం అనుకుంటూ... అందరూ ఒకచోట కూర్చొని ప్రసాదం తీసుకుంటారు.
ఇదీ పల్లె పడుచుల పండుగ బతుకమ్మ వేడుక.. అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు మనిషిని ఆరోగ్యంగా చేస్తాయని.. అంటువ్యాధులు ప్రభలకుండా ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడుతాయని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది.. ఈ పండుగ పూల ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మను జరుపుకోవలని కోరుకుంటూ.. మీ అందరికీ బతుకమ్మపండుగ శుభాకాంక్షలు
Friday, September 23, 2011
అంతరిక్షం నుంచి దూసుకొస్తున్న మృత్యు శకలాలు

సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం మొత్తం ప్రపంచం వణికిపోయింది.. అంతరిక్షం నుంచి నిప్పులు కక్కుకుంటూ ఈ ప్రపంచాన్ని అగ్నిగుండంగా మర్చడానికి ఓ మృత్యుశకలం దూసుకొస్తుందని భయపడింది.. ఆ మృత్యుశకలం పేరే స్కైలాబ్.. అంతరిక్ష ప్రయోగశాల.. ప్రపంచమొత్తాన్ని అగ్నిమారుస్తుందనుకున్న ఆ అగ్నివర్షం సముద్రం లో కురిసింది.. మళ్లీ ముప్పై ఏళ్ల తరువాత అదే భయం.. ఈ రోజు ఉదయం ఆర్స్ నేలను తాకే వరకు అదే ఆందోళన.. ఏ క్షణాన ముంపు ముంచుకొస్తుందని భయం.. ఇలా భయపడాలంటే కొన్ని వేల సార్లు భయపడాలి.. ఎందుకంటే అంతరిక్షం నిండా ఉపగ్రహాలే.. ఏదో ఓరోజు ఇవన్నీ భూమిమీద రాలాల్సినవే.. అంతరిక్ష ప్రమాదాల పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
ఒక పక్క ఈ విశాల విశ్వంలో స్వైర విహారం చేస్తున్న గ్రహశకలాలు ఎప్పుడు భూమిని ఢీ కొంటాయోనని మానవాళి భయపడుతోంది.. అపోసిస్ లాంటి భారీ శకలం భూమిని ఢీకొని ప్రళయాన్ని సృష్టిస్తుందని వణికుతోంది.. గ్రహ శకలాల నుంచి శాస్త్రవేత్తలు విశ్వమానవులు కాపాడగలరో లేదో గానీ.. వీళ్ళే మృత్యు శకలాలను మానవుడి నెత్తి పై సిద్ధంగా ఉంచుతున్నారు. ఇప్పుడు భూమి చుట్టూ వందల సంఖ్యలో ఉపగ్రహాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఉపగ్రహాలన్నీ ఏదో ఒకరోజు కూలిపోవలసిందే.. ఆకాశం నుంచి కూలిపోయే ప్రతి ఉపగ్రహానికీ ఇలా భయపడాల్సిందేనా.. అసలీ దుస్థితి ఎందుకొచ్చింది. అంతరిక్షంలో అసలేం జరుగుతోంది.
భూమికి ఒకప్పుడు చంద్రుడు ఒక్కడే ఉపగ్రహం.. అంటే భూమి చుట్టూ తిరిగే వాటిని భూమికి ఉపగ్రహాలంటారు. కానీ ఇప్పుడు భూమికి సుమారు 8 వేల ఉపగ్రహాలు తయారయ్యాయి. 1957లో రష్యా తొలిసారిగా ఉపగ్రహాన్ని ప్రయోగించినపుడు అదో చిరకాల స్వప్న సాకారం. అప్పటి వరకు ఉపగ్రహం అనేది ఒక కాల్పనిక సాంకేతిక పరిజ్ఞానం. అది సాధ్యమయ్యేదా అని నిరాశ చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి... పెరిగిన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి ఉపగ్రహమనేది ఇప్పుడొక చిన్న విషయంగా మారింది.. ట్రైనింగ్ లో ఉన్న యువ శాస్త్రవేత్తలు కూడా అవలీలగా ఉపగ్రహాలను తయారు చేసేంత స్థాయికి ఎదిగారు... కాని వచ్చిన చిక్కాల్లా అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాలు కాలం చెల్లాక అలాగే వదిలేస్తున్నారు. దీంతో అంతరిక్షం చెత్తబుట్టలా మారింది.. మరికొన్ని ఉపగ్రహాలు.. భూమ్యాకర్షణకులోనై భూమి వైపు దూపుకొస్తున్నాయి. ఈ శకలాలు కొన్ని భూ వాతావరణంలో చేరీ చేరకముందే భూ వాతావరణ ఘర్షణకు లోనై మాడిమసవుతాయి. వేగంగా దూసుకొచ్చే ఆ శకలాలు కొన్ని మండుకుంటూ భూమి ఉపరితలాన్ని తాకుతాయి. అప్పుడే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఈ ముప్పు శాస్త్రవేత్తలకు తెలిసిందే అయినా.. పట్టీ పట్టనట్టు ఉంటున్నారు. ప్రపంచదేశాలన్నిటి నడుమ అవగాహన లేకపోవడం వల్ల ఈ నిర్లక్ష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది.
ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ప్రతిదేశం ఆసక్తి చూపుతుండటంతో అంతరిక్షంలో తిరగాడే మానవ నిర్మిత వస్తువుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. నిర్ణీత కాలవ్యవధిదాకా పనిచేసి ఆ తరువాత మూలనపడ్డ శాటిలైట్స్, వాటి శకలాలు కూడా అంతరిక్షంలో తిరగుతూనే ఉన్నాయి. ఇలాంటివి సుమారు ఎనిమిదివేలదాకా ఉంటాయని అంచనా. ఇవి కాకుండా రాకెట్ ముక్కలు, స్పెష్ మిషెన్ లోని భాగాలు కూడా సొంత కక్ష్యల్లో తిరగుతున్నాయి. వీటిలో కొన్ని టన్నులకొద్దీ బరువున్నవి కాగా, మరికొన్ని కేవలం పది పౌండ్లు బరువున్నయి కూడా ఉన్నాయి. అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న వస్తువుల్లో కేవలం ఏడు శాతం మాత్రమే సాంకేతికంగా ఉపయోగపడుతున్నాయి.. మిగతావన్నీ అంతరిక్ష శిథిలాలే. వీటి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతోనే సమస్య వచ్చిపడింది. 1957 నుంచి ఇప్పటివరకు 4,600ల ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయి. మన భూమి చుట్టూ సుమారు ఎనిమిది వేల కృత్రిమ ఉపగ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి సంఖ్య రాబోయే కాలంలో మరింత పెరగుతాయి.
అంతరిక్ష చెత్తలో 22 శాతం కాలం చెల్లిన ఉపగ్రహాల వల్ల ఏర్పడిందే. ఇది ఇంకా పెరిగితే ఉపగ్రహాలు ప్రమాదాల బారిన పడటం ఖాయం. రోడ్డు ప్రమాదలంత కామన్ గా అంతరిక్ష ప్రమాదాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. స్పేస్ ఆర్బిట్ లోకి ఉపగ్రహాన్ని పంపి సంబరపడిపోయే రోజులకు స్వస్తి పలకాలి. అంతరిక్షంలో పని లేకుండా తిరగే వేలాది శకలాల నుంచి ఉపగ్రహాలను రక్షించుకోవడం ఇప్పుడో పెద్ద సమస్య. అందుకే, సంపన్నదేశాలు... అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేపనిలో పడ్డాయి. అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించడంకోసం ఇప్పటికే అనేక మార్గాలను అన్వేషించారు. అయితే పూర్తిగా తొలగించడం మాత్రం ఒక పెద్ద సవాలే. అంతరిక్షంలో శకలాల సంఖ్య పెరిగిపోతుంటే, రాబోయేది గడ్డుకాలమే. అంతరిక్షంలో తిరగాడే చెత్త పదార్ధాలను ముందుగా గుర్తించి వాటిని భూ వాతావరణంలోకి చేర్చి కాల్చేయాలి. కానీ అది అంత సులువైన పనికాదు. భారీ శకలాల నుంచి చిన్నాచితకా డెబ్రీస్ వేలాదిగా భూమిచుట్టూ తిరగుతున్నాయి. పైగా `స్పేస్ జంక్' ని తొలగించాలంటే అన్ని దేశాల మధ్య అవగాహన ఉండాలి. కలిసికట్టుగా కార్యక్రమం చేపట్టగలగాలి. గ్లోబల్ వార్మింగ్ విషయంలోనే అంటీముట్టనట్టున్న దేశాలు అంతరిక్ష చెత్త గురించి పట్టించుకుంటాయని ఆశించడం అత్యాశే అయినా అవసరమైన ఆశ.
ఉపగ్రహాలే అంతరిక్ష చెత్తగా మరాయానుకుంటే పొరపాటు. వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరాక ఏ చిన్న వస్తువుని బయటకు విసిరేసినా అది స్పేస్ క్రాఫ్ట్ ను వెంటాడి వస్తుంది. అదే వస్తువును బలమైన శక్తితో విసిరితే ఆ వస్తువు వేరే కక్ష్య ను ఏర్పాటుచేసుకుని మళ్ళీ ఎక్కడోఓచోట అడ్డం తగులుతుంది. లేదా అలా విసిరివేయబడిన వస్తువు మరో శాటిలైట్ ని ఢీకొనే ప్రమాదమూలేకపోలేదు. అంటే స్పేస్ ట్రావెల్ అంత తేలిక కాదన్నమాట. ఏప్పుడో ఒకప్పుడు ఏ క్షణంలోనైనా వ్యర్ధ శకలాలు ఎదురుకావచ్చు. అవి స్పేస్ క్రాఫ్ట్ ని ఢీకొనక తప్పదు. 1996లో ఫ్రెంచ్ గూఢచారి ఉపగ్రహాన్ని సూట్ కేసంత సైజున్న ఓ శకలం ఢీకొంది. దీంతో ఆ ఉపగ్రహం దెబ్బతిన్నది. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో అత్యంత సామాన్యమైనవిగా మారిపోతాయన్నదే ఇప్పుడు శాస్త్రవేత్తలందర్నీ పీడిస్తున్న భయం.
చాలాకాలం నుంచి వేలాదిగా అంతరిక్షనౌకలను ప్రయోగించారు. వాటిలో చాలా మటుకు పనిపూర్తయ్యాక విచ్ఛిన్నమయ్యాయి. అయితే వాటిలో కొన్ని భాగాలు ఇప్పటికీ స్పేస్ ఆర్బిట్స్ లో తిరగుతూనేఉన్నాయి. ఇలాంటి శకలాలను భూమికి మరింత దూరంగా నెట్టివేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఇందుకు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారన్నది అసలు ప్రశ్న. లేజర్ కిరణాలను ఉపయోగించడం ద్వారా కూడా అంతరిక్షంలోని చెత్తను తొలగించవచ్చని అంటున్నారు. కోట్లాది డాలర్లు ఖర్చుచేసి నిర్ణీతకక్ష్యలోకి పంపినా వాటి ఆయుష్షు ఎంతకాలమో శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. 2009 ఫిబ్రవరి నెలలో ఎవ్వరూ ఊహించని విధంగా అమెరికా, రష్యాదేశాలకు చెందిన ఉపగ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా అంతరిక్షంలో శకలాలు భారీగా వెదజల్లబడ్డాయి. వాటిలో చాలామటుకు సొంత కక్ష్యల్లో తిరగుతున్నాయి.
అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలు భూమ్యాకర్షణ శక్తి పరిధిలోకి ఎలా వస్తాయి. గతంలో 30 సంవత్సరాలకు ముందు ప్రపంచ ప్రజానీకాన్ని స్కైలాబ్ ఎందుకంత భయపెట్టింది. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు మానవమనుగడకు ముప్పు తేవడం వెనక కారణాలేంటి.. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే. గతంలో స్కైలాబ్ ప్రయోగం గురించి తెలుసుకోవాల్సిందే..
అవి సాంకేతిక వ్యవస్థను కొత్తగా కొత్తగా వాడుకుంటున్న రోజలు. అంతరిక్ష ప్రయోగం చేయడమంటే కత్తి మీద సాములాంటిది. అయినా శాస్త్రవేత్తలు ధైర్యం చేశారు. వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపారు. కానీ ఆ ఉపగ్రహంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అంతే ఉపగ్రహం వచ్చిన దారి తిరిగి మళ్లింది. అంటే తిరిగి భూమి మీద కూలడానికి సిద్ధమయింది. అది ఎక్కడ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. కానీ గండం తప్పింది. స్కైలాబ్ సముద్రంలో కూలడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.
అంతరిక్ష విజ్ఞానానికి బలమైన పునాదులు పడుతున్న రోజులవి.. అప్పుడప్పుడే ఉపగ్రహ వ్యవస్థ ఊపందుకుంటోంది.. సూర్యుడి పై విశేశాలు, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి 1979లో అంతరిక్ష ప్రయోగ శాలను ఏర్పాటు చేశారు. దాని పేరే స్కైలాబ్. ఈ స్కైలాబ్ ప్రయోగం వికటించింది.. సాంకేతిక సమస్యలు రావడంతో మళ్లీ భూమి పరిధిలోకి బయలు దేరింది.. శాస్త్రవేత్తలకు ఏంచేయాలో అర్ధంకాలేదు. ఒకపక్క కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ప్రయోగం విఫలమయిందే బాధ.. మరో పక్క ఆ స్కైలాబ్ చేయబోయే వినాశ ఎలా తప్పించాలనే ఆలోచన. ఈ వార్త ప్రసార సాధనాల ద్వారా ప్రపంచం మొత్తాన్ని చేరింది. . స్కైలాబ్ భూమిని తాకితే మహోత్సాతం తప్పదని ప్రజలంతా నిద్రలేని రాత్రులు గడిపారు. కొందరైతే ఇవే ఆఖరు గడియలని చేయాల్సిన ఎంజాయ్ చేశారు. ప్రపంచం తుడిచి పెట్టుకు పోతున్నంత హడావుడి చేశారు. కానీ గండం గడిచింది.. స్కైలాబ్ వైపు మళ్లి.. సముద్రంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది.. ప్రమాదం తప్పడంతో శాస్త్రవేత్తలంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. అంతేకాదు కొందరు తమ పిల్లలకు స్కైలాబ్ అని పేర్లు పెట్టుకున్నారంటే. స్కైలాబ్ ప్రపంచ పౌరుల పై ఎంత ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటీకీ ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో స్కైలాబ్ లున్నారు.
చరిత్ర పునరావృతం అయింది.. శాస్త్రవేత్తల నిర్లక్షమో... సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే అన్న దాటవేత దోరణి వల్ల.. మళ్లీ ముప్పై ఏళ్ల తరువాత అట్లాంటి ప్రమాదమే ప్రపంచాన్ని వణికించింది. స్కైలాబ్ ను గుర్తుకు తెచ్చింది. అయితే పెరిగిన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం.. ఇప్పటికే చాలా టి.వి ఛానళ్లు ప్రపంచం తుడిచి పెట్టుకుపోతుందనే కట్టుకథలు నిత్యం ప్రసారం చేయడం.. అవేవీ జరగక పోవడం వల్ల ప్రజలు ఇదీ కూడా అట్లాంటి ఊహాజనిత ప్రమాదం గానే పరిగణించారు. అమెరికా, యూరప్ లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల ప్రజలు కాస్త ఆందోళన పడుడ్డా.. భారత్ దాని పరిధిలో ఉన్న ప్రజలు కనీసం దీని గురించి ఆలోచించడానికి కూడా సాహసించ లేదు.
ఆర్స్ ఉపగ్రహం ఎందుకు భూమి వైపు దూసుకొచ్చింది. అంతరిక్షంలో ఉన్న ప్రతీ గ్రహం ఏదో ఒకరోజు భూమి పరిధిలోకి రావలసిందేనా.. అలా అయితే చెత్త బుట్టలా మారిన అంతరిక్షం భూమి పై తన పగ తీర్చుకోబోతోందా.. ఇంతకీ ఇప్పుడు భూమిని తాకి ఆర్స్ ఉపగ్రహం ఎప్పటిది.. ఈ ఉపగ్రహం భూమి పై ఇంత హల్చల్ చేసే వరకు శాస్త్రవేత్తలేం చేస్తున్నారు.
నిప్పులు చిమ్ముతూ ఆర్స్ ఉపగ్రహం భూగోళం పై పేలిపోయింది.. 1991లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం ఓజోన్ పొర అధ్యయనం కోసం ప్రయోగించారు. ఈ ఉపగ్రహం ఆరేళ్ళ క్రితమే అంతరిక్ష వ్యర్ధాల జాబితాలో చేరిపోయింది. మూడేళ్ల అవరసరాల కోసం అంతరిక్షంలోకి పంపిస యుఏఎస్ఆర్ను అగ్రరాజ్యం 15 ఏళ్లపాటు వినియోగించింది. ఇప్పుడది అదుపు తప్పి భూ వాతావరణం వైపుకు పయనిస్తోంది. ఆరున్నర టన్నుల బరువైన శాటిలైట్ శకలాల్లో చాలా వరకు.... భూ వాతావరణంలో ప్రవేశించగానే దగ్దమైపోతాయి ...మిగిలిన కొద్ది పాటి శకలాలు అంటే.. 532కిలోల బరువున్న ఉపగ్రహ శకలాలు భూగోళాన్ని ఢీకొన్నాయి.
ఈ సంఘటన నుంచి శాస్త్రవేత్తలు పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతరిక్షంలో భారీగా పేరుకు పోతున్న ఉపగ్రహాలను కాలం చెల్లగానే కాల్చేయాలి. లేజర్ కిరణాలతోనో.. లేదా ఇతర ఇంధనాలతోనే వీటని అంతరిక్షంలోనే మసి చేయాలి. వీటితో బాటు వ్యోమగాములు అంతరిక్షంలో వ్యర్ధ పదార్ధాలను విసరకూడదనే నియమం విధిగా పాటించాలి.
ఇక నుంచి ఏ ఉపగ్రహం,.. మానవాళికి విపత్తు కలిగించకుండా ఉండాలని క ోరుకుందాం.. అంతేకాదు అంతరిక్షం నుంచి మానవ ప్రయోగ వస్తువులేవీ భూమి పైకి దూసుకురావని ఆశిద్దాం.. భవిష్యత్తులోనైనా మన ప్రపంచ శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను ప్రయోగించి వదిలేయకుండా.. చెత్త బుట్టలో ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షలోనే బూడిద చేస్తారని ఆశిద్దాం..
Subscribe to:
Posts (Atom)