ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, May 1, 2010

బాసర సరస్వతి గురించి



బాసర… అదిలాబాద్ జిల్లా మధోల్ మండలంలో ఉంది. ఇది హైదరాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాసర పుణ్యక్షేత్రంలో చదువుల తల్లి జ్ఞానసరస్వతి అమ్మవారు కొలువై ఉంది. భారతదేశంలో సరస్వతి దేవాలయాలు రెండే ఉన్నయి. ఒకటి కాశ్మీర్లో ఉంటే రెండోది తెలంగాణలో బాసరలోనే ఉంది.
మానవులకు విజ్ఞాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతి కొలువైన దివ్య క్షేత్రం బాసర. గోదావరి ఒడ్డున కొలువైన ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులను ఆకర్షిస్తంది. తమ పిల్లలకు భవిష్యత్లో అపారమైన విజ్ఞానం సొంతం కావాలని కోరుతూ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టే తల్లితండ్రులతో ఈ బాసర క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది. గోదావరి నదీతీరాన బాసర కొలువున ఉన్న జ్ఞానసరస్వతీ దేవి కోట్లాది చిన్నారులకు చదువులు ప్రసాదించి అశేష భక్త జనానికి మనశ్శాంతిని ప్రసాదిస్తంది. ఈ సరస్వతీ దేవి ఆలయం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతిరోజు వేలాది మంది అమ్మవారిని దర్శించుకోవడం, తమ చిన్నారులను అక్షరాభ్యాసం చేయించుకోవడం కోసం బాసరకు వస్తుండటంతో బాసర సరస్వతీ దేవి ఆలయం భక్తజన సందడితో కిటకిటలాడుతోంది
బాసరలో కొలువై ఉన్న జ్ఞానసరస్వతిని దేశం నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటరు. సరస్వతి మాత, మహాలక్ష్మి, మహాకాళి సమేతంగా కొలువుదీరింది. ఈ మందిరం చాళుక్యులకాలంలో నిర్మించిండ్రు. దేవాలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరంగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం ఉంటది.
ధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉన్నది. ఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమని చెప్పుకుంటరు. అక్కడ "వేదవతి" అనే శిలపై తడితే ఒకో ప్రక్క ఒకో శబ్దం వస్తది. అందులో సీతమ్మవారి నగలున్నయని చెప్పుకుంటరు.
ఈ ఆలయానికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. ఇంద్రతీర్ధం, సూర్యతీర్ధం, వ్యాసతీర్ధం, వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్ధం, గణేషతీర్ధం, పుత్రతీర్ధం, శివతీర్ధం. గోదావరికి సమీపంలో ఒక శివాలయం ఉంది. దేవాలయంలో ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతరు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతది.
ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటరు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యార్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానుకలు సమర్పించే ఆచారము ఉన్నది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటయి.
బాసరలో వెలసిన ఈ క్షేత్రం పురాతనమైన ప్రాముఖ్యాన్ని కల్గిఉంది. బాసర క్షేత్రంలో కొలువైన సరస్వతీదేవిని వ్యాసుడు ప్రతిష్టించాడని ప్రతీతి.
గోదావరి ప్రవహిస్తున్న ఈపుణ్యభూమి వ్యాసమహర్షి పాద స్పర్శతో పుణీతమైనది. వ్యాసమహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయడాని కి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు పురాణాలు చెబు తున్నయి. బ్రహ్మాండ పురాణాన్ని రచి స్తున్నప్పుడు ప్రకృ తి ఖండంలోని శక్తి ని వర్ణించాల్సిన అవసరం ఏర్ప డిం ది. శక్తిని వర్ణించాలంటే మరింత తపశ్శక్తితోపాటు ఎలాం టి అంతరాయం లేని మహిమగల ప్రశాంత వాతావరణం అవసరం ఏర్పడింది. దీంతో ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి బాసర చేరుకున్నాడు. నాందేడ్ నుంచి బ్రహ్మేశ్వరం వరకు గోదావరి నాభిస్థానం అంటరు. ఇది అప్ప టికే పుణ్యస్థలం కావడంతో వ్యాసుడు ధ్యానం చేసుకోవడా నికి ఆగిండు.
గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్న ఆయ నకు శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయ మైంది. దీంతో ఆ రూపం ఎవరిదా? అని దివ్యదృష్టితో చూడగా జ్ఞానసరస్వతి అమ్మ వారు కనిపించగా పూర్తి రూపం కనిపించకపోవడానికి కారణం అడిగిండు. కొన్ని పాపకార్యాల వల్ల తన పూర్తి రూ పాన్ని చూపెట్టలేకపోతున్నానని అమ్మవారు ఆ రుషితో చెప్పింది. ప్రతిరోజు ధ్యానం చేసి గోదావరిలో పిడికెడు ఇసుకను నిచ్చన స్థానంలో వేయాలని, ఇలా వేసిన ఇసుక తో తన పూర్తి రూపం తయారవుతుందని, అనంతరం జ్ఞాన సరస్వతీగా అందరికి దర్శనమిస్తానని తెలిపింది. వ్యాసుడు గోదావరి తీరానికి కొంతదూరంలో ఉన్న కుమారచల పర్వతంలోని ఒక గుహలోకి తపస్సు ప్రారంభించిండు. అమ్మవారు చెప్పినట్టు ఇసుకను తీసుకువచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించిండు.
ఇలా కొన్ని ఏళ్లు గడిచిన అనంతరం అమ్మవారు రూపం పూర్తి కావడం, ఆమె జ్ఞాన సరస్వతిగా ఆవిర్భవిం చిందని పురాణాల్లో ఉంది. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతి దేవి ఆయనకు జ్ఞానభీజాన్ని ఉపదేశించింది. జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానానికి పుట్టుకగా వెలుగొందుతంది. భారతదేశంలో కన్యాకుమారిలో, కాశ్మీర్లలో సరస్వతీ దేవాలయాలు ఉన్నప్పటికీ చదువుల తల్లి జ్ఞానసరస్వతీ బాసరలోనిది మాత్రమేనని, దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. అయితే ఒక సరస్వతీ దేవినే ప్రతిష్టిం చడం సబబు కాదని, ఈమెకు తోడుగా మరో మహాకాళీ, మహాలక్ష్మీలను ప్రతిష్టించిండు.

పుత్రసంతానం కోసం దశ రథుడు ఇక్కడ పూజలు చేశా డు. ఎనిమిది మంది దేవతలు కోనేరులోని వివిధ ప్రాంతా ల్లో స్నానాలు చేయడంతో దీనికి అష్టతీర్థసరోవరమని పేరు వచ్చింది. ఒకసారి దుర్వాస మహముని సరస్వతీ దేవి ఇచ్చి న పుష్పమూలికను ధరించి స్వర్గలోకానికి వెళ్లి దాన్ని ఇంద్రునికి ఇచ్చిండు. ఇంద్రుడు దాన్ని నేలపై పడవేయడం తో దుర్వాసుడు కోపంతో ఇంద్రున్ని రాజ్యభ్రష్టునిగా చేసి కుష్టువ్యాధిగ్రస్తుడు కావాలని శపిస్తడు.
ఇంద్రుడు బృహ స్పతి మాట ప్రకారం కోనేరులోని తూర్పు భాగంలో స్నా నం చేసి శాపవిమోచనం పొందాడు. దీని కారణంగా ఆ స్థానానికి ఇంద్రతీర్థమని పేరువచ్చింది.
ఇద్రుడు పూజలు చేసిన స్థలం సరస్వతీ దేవి మందిరానికి పూర్వభాగంలో ఒక మైలు దూరంలో గోదావరి నదీతీరమున ఉంది. దీనిని ప్రస్తుతం కుక్కుటేశ్వరం అని పిలుస్తరు. సూర్యుడు ఆకలి ని తట్టుకోలేక మంత్రోచ్ఛారణకు ముందుగానే భుజించ డంతో ఆగ్రహించిన ఇంద్రుడు వజ్రాయుధంతో సూర్యుడు కాంతి హీనుడయినడు. కోనేరుకు ఆగ్నేయ భాగం లో స్నానం చేయ డంతో పూర్వ వైభవం వచ్చింది. సూర్యుడు పూజలు చేసిన చోట సరస్వతీ దేవికి ఆగ్నేయ దిశ గా అరమైలు దూరంలో గోదావరి నదీతీరాన ఉంది. ప్రస్తు తం దీనిని సూర్వేశ్వరమని పిలుస్తరు.
ఆలయానికి దక్షిణ దిక్కున ఉన్న వేదవ్యాసుడు తపస్సు చేసిన ప్రాంతాన్ని ఇప్పు డు వ్యాసతీర్థం అంటున్నరు. ఇక్కడ వ్యాసమందిరం కూ డా ఉంది. వాల్మీకి మహార్షి కోనేరు నైరుతి దిశలో స్నానం చేసి శ్రీమద్రామాయణం రాసిండు. అందుకే పూజలు చేసిన స్థలం బాసర బస్టాండు సమీపంలో రోడ్డుకు కుడివైపున శ్రీవెంకటేశ్వర మందిరంగా వెలుగొందుతొంది. వినాయ కుడు అగ్రపూజ అర్హత పొందేందుకు కోనేరు వాయువ్య దశలో స్నానం చేసిండు. గణేషుని మందిరం బాసర గ్రా మం నుంచి సరస్వతీ మందిరానికి వెళ్లే మార్గంలో ఉంది.
దశరథుడు ఉత్త ర తీరంలో స్నానం చేయడంతో దీనిని పుత్రతీర్థం అంటున్నారు. కుమారస్వామి పూజలు చేసిన స్నా నం కుమారతీర్థం, ఈశాన్య దిశలో ఈశ్వరుడు స్నానం చేసి దేవిని ధ్యానించిన ప్రాంతాన్ని శివతీర్థం అని పిలు స్తరు. సరస్వతీ మందిరానికి ఉత్తారన ఒక మైలు దూరం లో పాపహరేశ్వరాలయమని పిలుస్తరు. కోనేరులోని మధ్యభాగంలో ఉన్న దానిని సరస్వతీ తీర్థం అని పిలు స్తరు. దీనికి ఎనిమిది దిక్కుల ఎనిమిది పుణ్యతీర్థాలు ఉన్నయి.
పురాణకాలంలో నిర్మించబడిన ఆలయం దండయాత్రల కాలంలో ధ్వసం కావడంతో శృంగేరీ పీఠాధిపతి ఆలయాన్ని పునర్నించి అమ్మవారిని పునఃప్రతిష్టించిండ్రట. ప్రస్తుతం బాసరలో ఉన్నది ఆ ఆలయమే.
ఈ ప్రదేశమైన బాసర దేవతలైన సూర్యదేవుడు, గణపతి, దేవేందృడు విష్ణువు మొదలగు వారికి తపో భూమి. కుమారస్వామి దగ్గరలోని కొండ గుహలో తపస్సు చేసికొనినందున దినిని కుమారచలము అని పిలుస్తరు. ఇచ్చట సరస్వతీదేవి వెలసినందున కౌమారాచలము అని కూడా అంటరు.
ఆలయంలో ప్రతీ రోజు తెల్లవారుఝామున 4:30గంటలకు మహా లక్ష్మి, సరస్వతీ అమ్మవార్లకు అభిషేకం చెస్తారు. 4గంల నుండి అభిషేకం టికెట్టులు ఇస్తారు. ఐతే అమ్మవార్లకు దేవీ నవరాత్రుల రోజులలో ఈ అభిషేకం చేయరు. కేవలం నవరాత్రుల మొదటి రోజు మాత్రమే అమ్మవార్లకు అభిషేకం చెస్తారు.అభిషేకం చేసిన తరువాత అమ్మవారిని అలంకరిస్తారు. వారికి అలంకరించిన పసుపును ప్రసాదంగా ఇస్తారు. దీనిని బండారు అని అంటారు. ఇది నాలుక మీద వెసుకొంటే మేధస్సు పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ముఖ ద్వారం పక్కన నిత్యం చండీ హోమం దుర్గా సప్తశతి చెస్తారు. 516రుపాయలు చెల్లించి హోమంలో పాల్గొనవచ్చు. గుడి వెనుక మధ్యాహ్నము నిత్య అన్నదానం చెస్తరు.దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. ఆ తొమ్మిది రోజులు బాసరలొనే ఉంటరు.బాసరలోని సరస్వతీ దేవి ఆలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉంది. బాసర గ్రామం చిన్నదైనా ఆలయం మాత్రం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటది.
దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతీ ఆలయం అయి న దేవాలయమైన జ్ఞాన సరస్వతి ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శక్తిమూర్తులు సరస్వతీ, లక్ష్మీ, పార్వతీలు ఒకేచోట కొలువైన క్షేత్రం బాస ర కావడం మరింత విశేషం. అమ్మవారికి ప్రతిరోజు ఉద యం 4 గంటల నుంచి 6 గంటల వరకు అర్చకులచేత అభిషేకాన్ని నిర్వహించిన అనంతరం హారతి ఇచ్చిన తరు వాత సందర్శకులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 7-30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అక్షరాభ్యాసం, కుంకుమపూజ, వాహనపూజ, ఓడిబియ్యం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.గంట విరామం తరు వాత గుడి మళ్లీ తెరుచుకొని దైనందిన కార్యక్రమాలు కొన సాగిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తజనం అమ్మవారిని దర్శించుకొని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకొని మనశ్శాంతిని పొందుతారు.

ఆలయానికి కొంత దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ నదిలో స్నానం చేసి నదికీ సమీపాన ఉన్న శివుని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ. గోదావరీ పుష్కరాల కారణంగా బాసర క్షేత్రం ఇటీవల ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రాగణంలో ఇంద్రేశ్వరం, సూర్యేశ్వరం, వాల్మీకేశ్వరం, తరణేశ్వరం, కుమారేశ్వరం, వ్యాసేశ్వరం తదితర ప్రదేశాలు ఉన్నాయి. ఎంతో ప్రశాంతమైన ఈ ఆలయప్రాంగణంలో ఓ రోజంతా గడపగల్గితే అద్వితీయమైన అనుభూతి మన సొంతమౌతుంది.

ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి యాచించుట ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాళంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.

బాసర క్షేత్రం రాష్ట్ర రాజధాని నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, రైలు మార్గాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. బాసరలో వసతి సౌకర్యాలు సైతం చెప్పుకోదగ్గ రీతిలోనే ఉన్నయి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వసతి గృహాలతోపాటు రాష్ట్ర టూరిజం శాఖకు చెందిన వసతి గృహాలు కూడా ఉన్నయి. మహా శివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీనవరాత్రులు, వ్యాసపూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతయి.హైద్రాబాదు నుంచి మన్మాడ్ కు వెళ్లే రైలు మార్గములో గలదు రైలు, బస్సు మార్గము ద్వారా సులభము గా చేరు కొన వచ్చును. వీటిలో అద్దె కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుంది. భోజనం తదితర అవసరాలకు అనువుగా హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment